“మీ భూమి – మీ హక్కు” గ్రామసభ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Published on: 08/06/2026సిద్ధాంతం గ్రామం నుంచే రైతు సంక్షేమానికి మరో కీలక ముందడుగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి […]
Moreజూన్ 13న నరసాపురం, జూన్ 14న పెనుగొండలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 07/06/2026జిల్లాలో ఘనంగా ప్రారంభమైన “యోగాంధ్ర” కార్యక్రమం ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి జూన్ 21 వరకు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమం జిల్లాలో నేడు ఘనంగా ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శనివారం భీమవరం పట్టణంలోని […]
Moreసీఎం పర్యటనకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 06/06/2026లోపాలు లేని పట్టాదారు పాస్ పుస్తకాలనే రైతులకు అందజేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 8న పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలకు నర్సాపురం డివిజన్ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న […]
Moreసీఎం పర్యటన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
Published on: 06/06/2026విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవు కేటాయించిన విధులలో తప్పిదాలకు సంబంధిత అధికారులే బాధ్యులు పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలి …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూన్ 8వ తేదీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధాంతం పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఉదయం నుండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలి, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతం, క్యాడర్ మీటింగ్ ప్రాంగణం […]
Moreప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026ఆచంట నియోజకవర్గంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం విజయవంతం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం మార్టేరు శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నిర్వహించిన నాలుగో విడత నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ […]
Moreముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026జూన్ 9 ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చకచకా కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులు, సభాస్థలి […]
Moreపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్ను […]
Moreనెగ్గిపూడిలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ
Published on: 05/06/2026సైకిల్ ర్యాలీతో పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు ప్రత్యేక […]
Moreజూన్ 5న మార్టేరులో “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” నాలుగవ విడత కార్యక్రమం
Published on: 04/06/2026ఉదయం 9.30 గంటల నుంచి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జూన్ 5న ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్టేరు జడ్పీ స్కూల్ పక్కన ఉన్న వేణుగోపాల స్వామి ఆడిటోరియం నందు ఉదయం 9.30 గంటల […]
Moreజిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి
Published on: 04/06/2026ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరో్యకర ఓటర్ల జాబితా కీలకం అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి పారదర్శకంగా, సమర్థవంతంగా సర్వే నిర్వహణకు రాజకీయ పార్టీల సహకారం అవసరం …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక […]
More