ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026ఆచంట నియోజకవర్గంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం విజయవంతం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం మార్టేరు శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నిర్వహించిన నాలుగో విడత నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ […]
Moreముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026జూన్ 9 ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చకచకా కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులు, సభాస్థలి […]
Moreపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 05/06/2026పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు మంచి బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేస్తున్న సీడ్ బాల్స్ను […]
Moreనెగ్గిపూడిలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ
Published on: 05/06/2026సైకిల్ ర్యాలీతో పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు ప్రత్యేక […]
Moreజూన్ 5న మార్టేరులో “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” నాలుగవ విడత కార్యక్రమం
Published on: 04/06/2026ఉదయం 9.30 గంటల నుంచి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జూన్ 5న ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్టేరు జడ్పీ స్కూల్ పక్కన ఉన్న వేణుగోపాల స్వామి ఆడిటోరియం నందు ఉదయం 9.30 గంటల […]
Moreజిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి
Published on: 04/06/2026ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరో్యకర ఓటర్ల జాబితా కీలకం అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి పారదర్శకంగా, సమర్థవంతంగా సర్వే నిర్వహణకు రాజకీయ పార్టీల సహకారం అవసరం …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక […]
Moreతాడేపల్లిగూడెం మండలం మారంపల్లి కి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
Published on: 04/06/2026మారంపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి కొనుగోలుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల ఔదార్యం రైతులకు రూ.20 లక్షల అడ్వాన్స్ పంపిణీ తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి రూ.10 […]
Moreవిభిన్న ప్రతిభావంతులకు పూర్తి సబ్సిడీతో మూడు చక్రాల మోటారు వాహనాల పంపిణీకి భీమవరం, ఉండి నియోజకవర్గాల లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన పూర్తి
Published on: 03/06/2026అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి మూడు చక్రాల మోటార్ వాహనాల అందజేత … జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులు మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన […]
Moreఅర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 03/06/2026స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) నిర్వహణపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పౌరుని పేరు ఓటర్ల […]
Moreజనాభా గణన–2027లో భాగంగా గృహ గణన నమోదు రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశం
Published on: 03/06/2026జిల్లాలో కొనసాగుతున్న జనాభా గణన–2027 లో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్క గృహం కూడా నమోదుకు మిగలకుండా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. బుధవారం గృహ గణన నమోదులో తక్కువ ప్రగతి ఉన్న మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
More