Close

News

అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, రేపు సాయంత్రం లోపుగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Published on: 05/05/2025

గత రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే […]

More

పిజిఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Published on: 05/05/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసి అర్జీని సమర్పించుకునేందుకు పూర్తి అంగవైకల్యం కలిగిన బిడ్డను ఎత్తుకొని వచ్చిన దంపతుల వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పాప అంగవైకల్యంపై ఆరా తీస్తూ దివ్యాంగుల పెన్షన్ […]

More

జిల్లాలో నీట్ యూజీ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని, 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 05/05/2025

పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన రెండు నీట్ యూజీ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. నిట్ లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 1,128 పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 739 మంది పరీక్షలు హాజరయ్యారు. మొత్తం […]

More

ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి విధులను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు యోగ అభ్యసనం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 03/05/2025

శనివారం భీమవరం కాస్మోపాలిటీ క్లబ్ ఆడిటోరియంలో ఈషా ఫౌండేషన్, భీమవరం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగ, ప్రాణాయం, మెడిటేషన్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంటారని, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు యోగా చక్కటి మార్గం అన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం స్వీకరించలేకపోవడం, సరైన […]

More

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 02/05/2025

గురువారం అత్తిలి మండలం అత్తిలి, మంచిలి గ్రామాలలో మహిళా సమైక్య సభ్యుల ద్వారా నిర్వహిస్తున్న వివిధ స్వయం ఉపాధి యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలను చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మంచిలి గ్రామం సమైక్య భవనంలో ఎస్ హెచ్ జీ గ్రూపు సభ్యులు పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు […]

More

ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, విద్యలో రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 02/05/2025

గురువారం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బల్లిపాడు పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ లో పిఎం శ్రీ నిధులు రూ.15.58 లక్షల వ్యయంతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను, రూ.5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన వాలీబాల్, షటిల్, కబాడీ, లాంగ్ జంప్ కోర్టులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 01/05/2025

మే నెల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య, ఒంటరి మహిళల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక దివ్యాంగులు, తదితరులకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం గురువారం అత్తిలి మండలం అత్తిలి యానాదుల పుంతలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యానాదుల పుంతలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛనుదారుల గృహాల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లను […]

More

అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి

Published on: 01/05/2025

గురువారం భీమవరం మండలం చిన్నఅమీరo సెంటర్ -3 అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రెటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ. సూర్య కుమారి ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించారు. వారి పేర్లును అడిగి తెలుసుకొని పాటలు పాడించి సరదాగా గడిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్న విద్యా బోధనలు పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు పట్టి […]

More

జిల్లాలో మే 4న నీట్ యూజీ- 2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Published on: 30/04/2025

బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నీట్‌ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై నీట్ యూజీ అధికారులు, సూపరింటెండెంట్లు, విద్యా శాఖా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రెండు సెంటర్లను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిట్ లో ఒక పరీక్ష కేంద్రం, […]

More