Close

Press Release

Filter:

రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించే లక్ష్యంతో ఖచ్చితమైన ప్రయోగ ఫలితలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 17/04/2025

బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం ప్రయోగశాల నందు రూ.27 లక్షలతో ఏర్పాటుచేసిన అటోమిక్ అబ్సెర్ప్షన్ స్పెక్ట్రో ఫోటోమీటర్ ను, రూ.21 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ లిక్విడ్ చోరోమెటోగ్రఫీ మిషనరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రయోగ పరీక్షలు నిర్వహించే విధానాన్ని శిక్షణ పొందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులలో సూక్ష్మ, స్థూల పోషకాలను పరీక్షించేందుకు […]

More

ఆరోగ్యవంతమైన బిడ్డలు కలిగేందుకు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుని, క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 16/04/2025

ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా భీమవరం శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారన్నారు. ఆరోగ్యవంతమైన బావి […]

More

జిల్లాలో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా రానున్న వర్షాకాలం కంటే ముందుగా అన్ని నియోజకవర్గాల్లో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 15/04/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఆర్డీవోలు, డిటిఓ, మండల రెవెన్యూ అధికారులు, ఇసుక స్టాక్ పాయింట్స్ నిర్వహణ ఏజెన్సీదారులు, ట్రాన్స్పోర్ట్ వాహన యజమానులతో ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు […]

More

సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉండి నియోజకవర్గంలో రూ.3 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు … రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు

Published on: 15/04/2025

ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, త్రాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు సామాజిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని దీనికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద పి 4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతా దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజవర్గానికి చెందిన అనేకమంది దాతలు […]

More

భారత రాజ్యాంగం పితామహుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని రాష్ట్ర ఉప శాసన సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు

Published on: 15/04/2025

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భీమవరం అంబేద్కర్ సర్కిల్ నందు వున్న విగ్రహానికి రాష్ట్ర ఉప శాసనసభ పతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భారతదేశం ఇంత ఐక్యంగా ఉన్నది […]

More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Published on: 15/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించి […]

More

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి, వెనుకబడిన తరగతుల వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

Published on: 11/04/2025

శుక్రవారం పాలకొల్లు బస్టాండ్ సమీపంలోని అడబాల థియేటర్ వెనుక భాగంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ వర్గాలకు ఉపకరణాల పంపిణీకి ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర […]

More

దివ్యాంగుల కొరకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను శ్రద్ధ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Published on: 10/04/2025

గురువారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకారణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా […]

More

స్వచ్ఛమైన తాగునీటి ద్వారా 90 శాతం రోగాలకు దూరం కావచ్చునని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.

Published on: 10/04/2025

గురువారం భీమవరం బస్టాండ్ లో, జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక యువి వాటర్ ప్లాంట్లను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మాట్లాడుతూ ఉద్దరాజు […]

More

అత్యధికంగా రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాను అమెరికా ఆంక్షలు నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు.

Published on: 10/04/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమన్వయంతో సమీక్షించడం జరిగింది. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఎంఎల్సీ వంకా రవీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు […]

More