Close

Press Release

Filter:

స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయడంతో పాటు, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 17/05/2025

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో పక్కాగా నిబంధనలను పాటించాలని సూచించారు. తల్లిదండ్రులులేని పిల్లలను, భిక్షాటన చేసే పిల్లలను, బాల కార్మికులను గుర్తించి హోమ్ ఉంచి కచ్చితంగా చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను వదిలేసిన, అనధికారికంగా దత్తత ఇచ్చిన […]

More

రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నాణ్యమైన, స్థానిక వినియోగానికి అనుకూలమైన సాగు రకాలను పండించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు

Published on: 17/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లా, మండల ప్రాంతాలవారీగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు రకాలపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పండిస్తున్న పిఆర్ 126 వరి రకాన్ని ఎగుమతి దారులు, వినియోగదారులు, ప్రాధాన్యత చూపకపోవడం వలన ఈ రకాన్ని ప్రోత్సహించకూడదని వ్యవసాయ అధికారులకు సూచించారన్నారు. […]

More

మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 17/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఎన్ కార్డ్ (జిల్లా స్థాయి కమిటీ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి & ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ) పై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గంజాయి సాగు నియంత్రణ, రవాణా, అమ్మకం, వినియోగం, అవగాహన, గంజాయికి బానిసలు అయిన వారికి వైద్య సహాయం, పునరావాసం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా […]

More

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 16/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పి సి & పి ఎన్ డి టి యాక్ట్, ఏఆర్టి అండ్ సరోగసి యాక్ట్ అమలుపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమాజంలో స్త్రీ, పురుషు బేధం ఉండకూడదని, అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉంటున్నారన్న విషయాన్ని […]

More

రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 16/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బి, వైద్యశాఖ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ […]

More

పశ్చిమగోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పటివరకు వున్న సారా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 16/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవోదయం 2.0 (నాటుసారా నిర్మూలన) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ డిసి బి.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం సారా రహిత […]

More

తల్లిదండ్రులు లేని మానసిక బహుళ వైకల్యాలు కలిగిన బిడ్డల సంరక్షణకు చట్టపరమైన సంరక్షకత్వం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 16/05/2025

గురువారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పై ఏర్పాటుచేసిన సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ న్యూరో డెవలప్మెంటల్ రుగ్మత, మస్తిష్క పక్షవాతం, మానసిక మాంద్యం, బహుళ వైకల్యాలు కలిగిన బాలల సంరక్షణకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా చట్టపరమైన సంరక్షకత్వం హక్కును కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా […]

More

జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పును తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

Published on: 16/05/2025

గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ ద్వారా స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ నెల 17న “బీట్ ద ఈట్” థీమ్ తో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వడగాల్పుల కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకూడదన్నారు. […]

More

ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, తాగునీటి వనరులలో చేపల చెరువుల నీళ్లు, కాలవ గట్ల నివాసాల్లోని సెప్టిక్ నీటిని వదిలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Published on: 15/05/2025

గురువారం ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో తొలుత హాస్పటల్ ను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాళీ స్థలం వైపు నుండి కొంతమంది ఆకతాయిలు హాస్పిటల్ అద్దాలను పగలగొడుతున్నారని ఉపసభాపతి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ సీసీ కెమెరాలను […]

More

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్క్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 15/05/2025

గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీచైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణాలకు మంచి ఆలోచన చేసిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు. […]

More