జిల్లాలో వంట నూనెలు, నిత్యవసర వస్తువులు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి–. ….జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 04/03/2026వ్యాపారస్తులు వంట నూనెలు, పప్పులు కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు. రైతు బజార్లో అమ్మే కూరగాయల ధరలు కన్నా బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు అమ్మకాలు జరిపే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం జిల్లా పౌర సరఫరాలు, జిల్లా ప్రణాళిక శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు, వంట నూనెలు, పప్పులు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు హెచ్ ఎల్ ఓ మొబైల్ యాప్ లో ఎవరికి వారు స్వయంగా వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 03/03/20262027 జనాభా లెక్కల సేకరణను నూరు శాతం విజయవంతం చేయాలి. మొదటి దశలో మే 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే గృహ గణన నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలి. 2027 జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేసి కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసిల్దారులు, […]
Moreఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా మార్చి 2 నుండి మార్చి 20 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
Published on: 02/03/2026కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహిళా సాధికారత కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని తెలిపారు. మహిళల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, డిఆర్డిఏ, మెప్మా, విద్యా శాఖ, కార్మిక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ తదితర శాఖలు పరస్పర […]
Moreదివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 02/03/2026కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు అర్జీల సమర్పించేందుకు వస్తుంటారని, ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే పీజిఆర్ఎస్ కు వందలాదిమంది వినతి పత్రాలు సమర్పించేందుకు వస్తున్నారన్నారు. ప్రతిరోజు వివిధ మండలాల నుండి కలెక్టరేట్లో జరిగే సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పై అంతస్థకు రావడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్న […]
Moreఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 02/03/2026శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి జాతరలు, వేడుకలు, దేవాలయాలు, ఆసుపత్రులు వద్ద పెద్ద శబ్దాలతో సౌండ్ సిస్టం వినియోగించరాదు, బాణాసంచా కాల్చరాదు. జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిaరం లో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శబ్ద, వాయు కాలుష్యం, ఏకీకృత కుటుంబ సర్వే, ఈ కేవైసీ, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతరలు, […]
Moreపిజిఆర్ఎస్ లో అందిన ప్రతి వినతిని అధికారులు ఓర్పుతో చదివి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
Published on: 02/03/2026అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు… రెవెన్యూ క్లినిక్ లో 32 దరఖాస్తులు స్వీకరణ. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, […]
Moreడిజిటల్ భవన్ లో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 28/02/2026శనివారం పి.ఎం లంకలో జరిగిన పడవల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆమె డిజిటల్ భవన్ను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణలను స్వయంగా పరిశీలించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో చరవాణిలో స్వయంగా నేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ భవన్లో ఉచితంగా నాణ్యమైన కోర్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా […]
Moreరామకృష్ణ మిషన్ వధాన్యత మత్స్యకార కుటుంబాలలో చిరస్థాయిగా నిలుస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/02/2026మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద 100 మంది పేద మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 వేల విలువైన బోట్లు, వలలు పంపిణీ… జిల్లా కలెక్టర్ ఆలోచనతో రామకృష్ణ మిషన్ ఔదార్యంతో పేద మత్స్యకారి కుటుంబాలకు సమకూరిన బోట్లు, వలలు బోట్లు అందుకున్న కుటుంబాల కళ్ళలో ఆనందం అనిర్వచనీయం నేడు నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద రాజమండ్రి రామకృష్ణ మిషన్ […]
Moreనరసాపురం పట్టణం 15వ వార్డులోని బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ…
Published on: 28/02/2026ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అంతటా 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పింఛన్లు పంపిణీ …..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. నరసాపురం పట్టణం 15వ వార్డు మసీదు సెంటర్ వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు నేడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, […]
Moreచిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో తాగునీటి కారణంగా ఒంటిపై దురదలు వచ్చాయి అనే సందేశం గురువారం రాత్రి అందిన వెంటనే వైద్య శాఖ అధికారును అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్..
Published on: 27/02/2026రాత్రికి రాత్రే వైద్యాధికారులు ప్రతి ఒక్కరిని పరిశీలించి స్కిన్ ఎలర్జీ ఉన్న 54 మందిని గుర్తించి ఆయింట్మెంట్, టాబ్లెట్లు పంపిణీ. ప్రమాదకర పరిస్థితి లేదని ధ్రువీకరించిన వైద్యులు త్రాగునీటి కారణంగా స్కిన్ ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నవారు భయపడవలసిన అవసరం లేదు.. అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం త్రాగు నీటిని వెంటనే తనిఖీ చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు శుక్రవారం త్రాగునీటి సరఫరాను తనిఖీ చేసి పంచాయతీ సెక్రటరీకి స్వల్ప జాగ్రత్తలను తెలియజేసిన […]
More