ఫేజ్ -1,2,3 రీ సర్వేకు సంబంధించి రైతుల పూర్తి సమాచారాన్ని సత్వరమే వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలి–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 23/01/2026ఫిబ్రవరి 2 నుండి 9 వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఆక్వా రైతుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్స్, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రీ సర్వే అంశాలపై ఆర్డీవోలు, తహాసిల్దార్లు, ఎఫ్.డి.ఓలు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ […]
Moreరానున్న వర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో అవసరమైన ఇసుక నిల్వలను ముందస్తు సిద్ధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 23/01/2026జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం సంబంధిత కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి, సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఎండిఎల్ పాయింట్స్ […]
Moreజిల్లాలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఫిర్యాదులు అందితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 23/01/2026భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను అంతా పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మాత్రం మధ్యాహ్నం భోజనంలో అన్నం సరిగ్గా ఉడకడం లేదని […]
Moreజిల్లాలో యూరియా కొరత లేదు, రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలి
Published on: 22/01/2026కౌలు రైతులను పిఎసిఎస్ లో మెంబర్లు గా చేర్చుకుని పంట రుణాలను అందజేయాలి.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి.. తణుకు మండలం వేల్పూరు గ్రామం ఏర్పాటుచేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు డివిడెండ్, వడ్డీ రాయితే పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సహకార సంఘాలు ఎరువులు అమ్మకాలు, పాల సేకరణ, గోల్డ్ లాకర్స్, పంట […]
Moreపట్టాదారు పాసు పుస్తకాలు వెరిఫికేషన్ వేగవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 22/01/2026పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో రెవిన్యూ అధికారులు, రైతులతో కలిసి మాట్లాడారు. మండలంలో రీ సర్వే పూర్తి అయిన యనమదుర్రు గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారుపాసు […]
Moreజిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 22/01/2026ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలి తణుకు మండలం యర్రాయి చెరువు ప్రాంతంలో యువ రైతు రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హైడ్రోపోనిక్ యూనిట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించి రైతు ఏర్పాటు చేసిన యూనిట్, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
Moreభీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 22/01/2026భీమవరం పురపాలక సంఘ పరిధిలోని తాడేరు రోడ్డులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో జాయింట్ కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకొని వృద్ధులకు దానిమ్మకాయలు, కమలాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. వృద్ధులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్యం, భద్రత తదితర ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. […]
Moreజిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది
Published on: 22/01/2026జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి.. తణుకు నియోజకవర్గంలో ఎం ఎస్ ఎం ఈ ప్రవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధికి అవగాహన సమావేశం నిర్వహణ జిల్లాలో ప్రభుత్వ భూములు కొరత కారణంగా ప్రభుత్వ సూచనలతో ప్రైవేటు భూములు కలిగిన యజమానులు ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటుకు ముందుకు రావాలి మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పరిశ్రమల స్థాపనకు 45 శాతం సబ్సిడీకి అర్హులు పారిశ్రామికవేత్తలు పరిశ్రమ స్థాపన వరకు అవసరమైన సహాయ […]
Moreవిద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధ, లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 21/01/2026గునుపూడి రైతు బజార్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల, బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినిలతో సమావేశమై వారితో అనేక విషయాలపై మాట్లాడుతూ సమాధానాలను తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు, హాస్టల్ లో వసతి ఎలా ఉంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా, అందరికీ మంచాలు, దోమతెరలు ఉన్నాయా తదితర విషయాలపై ఆరా తీశారు. హాస్టల్లో వుండి ఇంజనీరింగ్ చదువుకుంటూ […]
Moreజిల్లాలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 21/01/2026కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,32,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 65,704 ఎకరాలు ఆక్వా సాగు అప్సడలో రిజిస్ట్రేషన్ జరిగిందని, 39,816 ఎకరాలు అప్సడలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం అప్సడలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని మత్స్యశాఖ […]
More