పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో యశస్విని ఆదర్శంగా తీసుకోవాలి ..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 25/04/2025శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన నిమ్మల యశస్విని ప్రత్యేకంగా అభినందించారు. ఏం చదవాలి అనుకుంటున్నావు అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించిన సందర్భంలో నేను పోలి సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నానని, పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్, ఐటిఐ కోర్సులు పూర్తి […]
Moreప్రభుత్వ పాఠశాలలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనపై ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Published on: 25/04/2025శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ పదో తరగతి పరీక్ష ఫలితాలు, ప్రభుత్వ పాఠశాలలో చేరికలు, అల్పదాయ వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు, బడి బయట పిల్లలు చేరికలు, ఆపార్ ఐడి నమోదు అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకు మేటిగా నిలుస్తుందో ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలన్నారు. కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు […]
Moreనిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు
Published on: 25/04/2025శుక్రవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్క్ ఫ్రంహోం, ఈ కేవైసీ, ఆధార్ నమోదు, మిస్సింగ్ సిటిజన్స్, మనమిత్ర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వివిధ సమస్యల పరిష్కారంపై సమీక్షిస్తున్న లక్ష్యం మేరకు ఫలితాలు సాధించలేకపోతున్నారన్నారు. లక్ష్య సాధనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పన్ను వసూళ్ల […]
Moreనాటికలను బ్రతికించుకుందాం అని, ఉండి నియోజకవర్గంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనన్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపవాసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు
Published on: 25/04/2025గురువారం భీమవరం చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో కీర్తిశేషులు గోకరాజు రంగరాజు రామాయమ్మ కళావేదిక నందు దుగ్గిరాల సోమేశ్వరరావు, కొత్తపల్లి శివరామరాజు పేరిట 18వ సంవత్సర జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలను రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రముఖ సినీ నటులు రావు రమేష్, చైతన్య భారతి కార్యవర్గం సభ్యులు, తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర […]
Moreగురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పారిశుధ్యం, పింక్ టాయిలెట్స్, ప్లాస్టిక్ నిర్మూలన, చలి వేంద్రాలు ఏర్పాటు పై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు.
Published on: 25/04/2025పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పారిశుధ్యం నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పింక్ టాయిలెట్స్ నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలన్నారు. మురుగు కాలువలు క్లీన్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వర్షాకాలంలో ఎక్కువగా నీట మునిగే […]
Moreప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులు 80 శాతం సంతృప్తికరంగా ఉన్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 25/04/2025గురువారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిజిఆర్ ఎస్ అర్జీల పరిష్కారం, రెవిన్యూ అంశాలపై నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో దాసిరాజు, తహాసిల్దార్లు, వీఆర్వోలు తో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. వారు ఏ పని మీద వస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులో […]
Moreపౌష్టికాహారం, ప్రశాంతతో మంచి ఆరోగ్యమైన బిడ్డ జన్మానికి తోడ్పడుతాయని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘు రామకృష్ణంరాజు అన్నారు.
Published on: 25/04/2025గురువారం ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ పక్వాడా పౌష్టికాహార పక్షోత్సవాల్లో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ నటులు రావు రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని […]
Moreప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థుల అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 25/04/2025గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలయందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థిని, విద్యార్థులను మెమొంటోలతో సత్కరించారు. అదేవిధముగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించియున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాలకు సంబందించి మార్గనిర్ధేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ […]
Moreభీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు.
Published on: 23/04/2025బుధవారం భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాత బస్టాండ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి శరవేగంగా చర్యలు చేపట్టడం జరిగిందని దీనిలో భాగంగా 1962లో ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త బస్టాండ్ నుండి […]
Moreవిజ్ఞానాన్ని పంచడంలో పుస్తకాలు ప్రధమ భూమికను పోషిస్తాయని, పుస్తకాలను అందజేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
Published on: 23/04/2025స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మానవత సేవా సంస్థ కోశాధికారి గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, మిర్చిపాటి గున్నేశ్వరరావులు కాంపిటేటివ్ ఎగ్జామ్ లకు ప్రిపేర్ అయ్యే వారికి చదువుకునేందుకు ఉపయోగపడే, డిఎస్ సి, ఆర్ ఆర్ బి, గ్రూప్స్ సంబంధించిన మొదలగు పుస్తకములను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ పుస్తకములను జాయింట్ కలెక్టర్ ఛాంబర్ […]
More