Close

Press Release

Filter:

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అవగాహనతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 09/05/2025

శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విపత్తుల నిర్వహణపై అవగాహన శిక్షణా తరగతులను గూగుల్ మీట్ ద్వారా జిల్లా, డివిజన్, మండల, స్థాయి అధికారులు, సిబ్బందికి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విపత్తుల కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈరోజు శిక్షణా తరగతుల ద్వారా తెలియజేయడం జరుగుచున్నదన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో […]

More

భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు అందుబాటులోకి వచ్చిన తల సేమియా సేవలను జిల్లాలోని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 09/05/2025

గురువారం మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా ఐ.ఆర్.సి.ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయలం బ్లడ్ బ్యాంక్ కేంద్రం నందు ఏర్పాటుచేసిన ఆరు పడకల తలసేమియా డే కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ […]

More

ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 08/05/2025

గురువారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉండి మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా సాగులో సాంకేతిక అనుకరణలు, యాజమాన్యం పద్ధతులు అంశంపై రైతులకు జరుగుచున్న మూడు రోజులు శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతో అధిక ఉత్పత్తులు సాధించవచ్చునని అన్నారు. ఆక్వా సాగులో మంచి క్వాలిటీతో ఉత్పత్తిని పెంపొందించడానికి, రైతులు కొత్త టెక్నాలజీ పద్ధతులను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో […]

More

ప్రస్తుత రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా కేంద్రాల ద్వారా 55,983 మంది రైతులు వద్ద నుండి 5.21 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమును కొనుగోలు

Published on: 08/05/2025

రూ.1,200 కోట్లకు గాను రూ.1,130 కోట్లు రైతులు ఖాతాలో డబ్బులు జమ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ మరియు గన్ని బ్యాగులు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024- 25 సంవత్సరం రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా […]

More

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రెండు రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ అవార్డులకు ఎంపిక…

Published on: 07/05/2025

విజయవాడ రాజ్ భవన్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఆహ్వానం మే 8న రాష్ట్ర గవర్నర్ చేతులు మీదుగా అవార్డులను అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు చదలవాడ నాగరాణి అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా 2023-24, 2024-25 సంవత్సరాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రెడ్ క్రాస్ అవార్డులతో సత్కరించడానికి ఎంపిక చేయడం […]

More

మిల్లుల వద్ద ధాన్యం లోడులు దిగుమతుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ అన్నారు.

Published on: 07/05/2025

మంగళవారం పెంటపాడు మండలం ఆకుతీగలపాడు విజయ కృష్ణ రైస్ మిల్లు, దర్శిపర్రు రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం లోడులు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన బియ్యం డెలివరీలు పూర్తి చేయాలని ఆవేశించారు. దర్శిపర్రు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో సాగు వివరాలు, ధాన్యం వివరాలు, గోనే సంచుల […]

More

మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిరంతరం రైతులకు సూచనలు ఇస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/05/2025

చేపలు, రొయ్యలు సాగులో ఎటువంటి యాంటీ బయటిక్ మందులు వాడరాదు, టెక్నాలజీని ఉపయోగించాలి.. మంగళవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉండి మత్స్య పరిశోధన కేంద్రం నందు ఆక్వా రైతులకు ఆక్వా పద్ధతులు నిర్వహణ మరియు నైపుణ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వాకల్చర్ లో మంచి యాజమాన్య […]

More

కౌలు రైతులకి విరివిగా రుణాలను అందించాలి. పిఎంజెజెబివై, పి.ఎం ఎస్ ఎస్ వై, బీమా పథకాలలో ప్రతి ఒక్కరూ నమోదు అయ్యేలా చూడాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/05/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం (జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం మరియు జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పథకాల లక్ష్యసాధనకు ప్రతి బ్యాంకు తమవంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాల మంజూరుకు బ్యాంకర్లను ఆదేశించారు. విద్య, గృహ రుణాలను […]

More

రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదని ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Published on: 06/05/2025

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని వశిష్ట సమావేశం మందిరం నందు మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురౌతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం ఉభయ పశ్చిమగోదావరి […]

More