మహిళా సమైక్య సభ్యులు వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికపురోభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Published on: 13/08/2025బుధవారం ఉండి మండలం మహాదేవపట్నలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘంకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ.8.75 లక్షల సబ్సిడీతో మంజూరుచేసిన రూ.25 లక్షల వ్యయంతో నెలకొల్పిన “స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని” రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారుచేసే చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. […]
Moreస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం కావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/08/2025ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫలను ‘హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మన ప్రధాని మోదీ […]
Moreమానవతా సేవలు అభినందనీయం-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/08/2025ప్రస్తుత తరుణంలో మానవీయతపై ఆలోచన చేసి ఆచరణలో అమలు చేస్తున్న మానవతా సంస్థ సేవలు అభినందినీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో మానవతా సంస్థ రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన శాంతి రథాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సంబంధాలు తగ్గుతున్న ఈ రోజుల్లో అనాధ శవాలు, పేదల భౌతికకాయాలు అంతిమ యాత్రగా […]
More“విక్షిత్ భారత్” దార్శనికతను సాకారం చేసుకోవడానికి ప్రటిష్టమైన, అధిక నాణ్యత గల పాఠశాల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Published on: 12/08/2025మంగళవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు “విక్షిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య – నిర్మాణ విభాగాలు” అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఒక్కరోజు వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని పలు సూచనలు, ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ప్రధానమంత్రి వ్యక్తీకరించబడిన “విక్షిత్ భారత్” దార్శనికత, భారతదేశాన్ని 100వ స్వాతంత్ర్య దినోత్సవంతో సమానంగా 2047 […]
Moreపిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకొని రక్తహీనతకు దూరం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు .
Published on: 12/08/2025మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నులిపురుగులు ప్రమాదకరమని వీటివల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశం అని ఆమె అన్నారు. ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సులోపు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగుల […]
Moreప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పటిష్టమైన విద్యను అందించేందుకు ఉచిత ప్రైవేటు తరగతులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 11/08/2025సోమవారం భీమవరం దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన “విద్యా సౌజన్యం లెర్నింగ్ సెంటర్” (ఉచిత ప్రైవేట్ తరగతులను) ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య నుండే మెరుగైన విద్యను అందించడం ద్వారా చక్కటి విద్యకు పునాది పడుతుందన్నారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంటి వద్ద పాఠాలను చదివించడం, నేర్పించడం కష్టంగా ఉంటుందని, ఇటువంటివారికి ప్రైవేట్ తరగతులు ఎంతో […]
Moreజాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతనికి అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 11/08/2025జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీన జిల్లా అంతటా నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికలను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలు, కిషోర్ బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారన్నారు. అదేవిధంగా శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారన్నారు. ఆల్బెండజోల్ 400 […]
Moreఅర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
Published on: 11/08/2025పిజిఆర్ఎస్ వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకంజలో ఉండడంపై సంబంధిత శాఖల అధికారులపై ఆగ్రహం … ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు *పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ […]
Moreయువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 11/08/2025అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా “హర్ ఘర్ తిరాంగా” కార్యక్రమంలో పౌరులలో జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా సుమారు 2 వేల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల నుండి సాగిన భారీ ర్యాలీలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇంటింటా […]
Moreఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే విద్యతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 09/08/2025శనివారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదరికం నుండి బయటకు రావాలంటే ఒక్క విద్యతోనే సాధ్యమని అన్నారు. గిరిజనుల జీవన విధానమును […]
More