Close

Press Release

Filter:

ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవలపై వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/05/2025

గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆస్పత్రులలోనే మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నరసాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓ.పి రిజిస్టర్లు, పలు విభాగాలను, వైద్య సేవలు అందించే అన్ని వార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. […]

More

ప్రభుత్వ వసతి గృహాల మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేసి విద్యార్థిని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/05/2025

మంగళవారం నరసాపురం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలికలు, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలు మరియు చలవపేట బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికగా తనిఖీ చేశారు. జరుగుచున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల మరమ్మత్తు పనులతోపాటు త్రాగునీరు, టాయిలెట్స్, మరియు డ్రైనేజీ సదుపాయలు గురించి […]

More

లేసు అల్లికదారులు ఆర్థిక స్వావలంబన దిశగా పైనించాలి…..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/05/2025

లేసు అల్లికలలో వినియోగదారులు అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లు రూపొందించాలి.. మంగళవారం నరసాపురం మండలం రుస్తుంబాధ అలంకృతి లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుచున్న డిజైన్ వర్క్ షాప్ లో పాల్గొని లేస్ అల్లికల మీద శిక్షణ పొందుచున్న మహిళలు అల్లిన పలు విధాల లేసు డిజైన్లను ఆమె పరిశీలించారు. లేస్ అల్లికల శిక్షణ పొందే మహిళలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు సలహాలను […]

More

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడంతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు

Published on: 19/05/2025

ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 172 …..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా […]

More

తణుకు జిల్లా ఆస్పత్రిని అందరి సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 18/05/2025

శనివారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.అరుణ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 26 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. కొన్ని పనులకు ఆమోదం తెలుపగా, మరికొన్ని అంశాలు సంబంధించి సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని […]

More

వాతావరణం సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎండ వేడి నుండి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 18/05/2025

స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం హిట్ ద బీట్ థీమ్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తణుకు జిల్లా ఆసుపత్రి నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపున నిర్మించనున్న పింక్ టాయిలెట్స్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ప్రాంగణం […]

More

ప్రతి పట్టణం, గ్రామంలో ప్రతి మహిళ ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాల్లో కంపోస్ట్ తయారు చేసి కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు వినియోగించడం ద్వారా తడిచెత్త డంపింగ్ కాకుండా సద్వినియోగం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి తెలిపారు.

Published on: 18/05/2025

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ఒక థీమ్ తో నిర్వహించే కార్యక్రమానికి శనివారం తణుకు పట్టణంలో ఏర్పాటుచేసిన “హిట్ ద బిట్” కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద కొబ్బరి బొండాల దుకాణదారులకు ఐడి కార్డులను అందజేశారు. పట్టణంలో మొత్తం 24 మంది కొబ్బరి బొండాల దుకాణదారులను గుర్తించి మున్సిపల్ […]

More

ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంత మయ్యాయని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు

Published on: 17/05/2025

పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంతమైన సందర్భంగా శనివారం భీమవరం పట్టణంలో వీసాకోడేరు వంతెన వద్ద నుండి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనము వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, స్థానిక […]

More

స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయడంతో పాటు, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 17/05/2025

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో పక్కాగా నిబంధనలను పాటించాలని సూచించారు. తల్లిదండ్రులులేని పిల్లలను, భిక్షాటన చేసే పిల్లలను, బాల కార్మికులను గుర్తించి హోమ్ ఉంచి కచ్చితంగా చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను వదిలేసిన, అనధికారికంగా దత్తత ఇచ్చిన […]

More

రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నాణ్యమైన, స్థానిక వినియోగానికి అనుకూలమైన సాగు రకాలను పండించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు

Published on: 17/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లా, మండల ప్రాంతాలవారీగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు రకాలపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పండిస్తున్న పిఆర్ 126 వరి రకాన్ని ఎగుమతి దారులు, వినియోగదారులు, ప్రాధాన్యత చూపకపోవడం వలన ఈ రకాన్ని ప్రోత్సహించకూడదని వ్యవసాయ అధికారులకు సూచించారన్నారు. […]

More