పశ్చిమగోదావరి జిల్లాకు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గా జులై 2022 నుండి 2025 వరకు మూడు సంవత్సరములు అత్యుత్తమ సేవలు అందించి వరుసగా ఆరుసార్లు అవార్డులు అందుకొని డబల్ హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించిన శ్రీ టి శివరామ ప్రసాద్ ఇటీవలే కృష్ణాజిల్లాకు బదిలీ అయిన సందర్భముగా ఆయనను సత్కరించుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పౌరసరఫరాల సిబ్బంది సభ ఏర్పాటు చేయడం జరిగింది.
Published on: 26/06/2025ఈ సభకు ముఖ్యఅతిథగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరు అయ్యారు. అలానే ఈ సభలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల సిబ్బంది, మరియు రైస్ మిల్లర్లు తదితరులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ వారు మరియు ఇతర జిల్లా మరియు మండల స్థాయి అధికారులు ఈ మూడేళ్లలో టి.శివరామ ప్రసాద్ తో వారికి కలిగిన అనుభవాలను అందరితో […]
Moreస్వయం సహాయక సంఘాల సభ్యులు నూతన ఆలోచనలు చేసి కొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 26/06/2025బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంటర్ పెన్యూర్ యాక్షన్ ప్లాన్ (EAP) అమలుపై మెప్మా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యానికి అనువైన యూనిట్ల స్థాపించి ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. నూతన ఆలోచనలతో మార్కెట్ […]
Moreపి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల సర్వేలను ఆదేశించారు
Published on: 25/06/2025జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పి జి ఆర్ ఎస్ లో వచ్చిన దరఖాస్తులు పెండింగ్, జాయింట్ ఎల్ పి ఎం ఎస్ సంబంధించిన పురోగతిపై బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి, డివిజన్ మరియు మండల సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి […]
Moreఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 25/06/2025భీమవరం ఆర్ ఆర్ డి ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (Apssdc) మరియు నేషనల్ కెరియర్ సర్వీస్ (NCS) ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు నిర్వహించిన మెగా ఉద్యోగ మేళ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూత్ ఫర్ జాబ్ ఫౌండేషన్, రెడ్డి ఫౌండేషన్ వారు ఈ ఉద్యోగ మేళాలో […]
Moreఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతోపాటు, సమస్యను ఓర్పుతో వినాలి. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 23/06/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసిరెడ్డి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డితో కలసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు […]
Moreఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ పేరెడే గ్రౌండ్స్ లో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 21/06/2025పశ్చిమలో పండుగ వాతావరణంలో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు. భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన కార్యక్రమం. విశాలమైన 8 ఎకరాల మైదానంలో పచ్చని చెట్లు మధ్య ఆహ్లాదకరంగా జరిగిన యోగాబ్యాసనాలు విశాఖలో ప్రధానమంత్రి పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగా అభ్యసనాలు కొనసాగిన తీరు అత్యద్భుతం.. అందరినీ ఆకట్టుకున్న క్రమశిక్షణతో జరిగిన యోగా అభ్యాసన కార్యక్రమం. పశ్చిమగోదావరి జిల్లా అంతట సుమారు 8 లక్షల మందితో 4,835 ప్రదేశాల్లో యోగ […]
Moreరెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాన కలిగి, ప్రజలకు మంచి సర్వీసులను అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు ఎల్లప్పుడూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 20/06/2025శుక్రవారం ఘనంగా రెవిన్యూ డే వేడుకలను స్థానిక జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి రెవిన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసారు. రెవిన్యూ శాఖలో పనిచేయడం గర్వపడాల్సిన విషయంగా పేర్కొన్నారు. ప్రజలపట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు. రెవెన్యూ శాఖ ఒక వ్యవస్థ అని, రెవిన్యూ శాఖలో ఎక్కువ మొత్తంలో నవీకరణ విషయాలు ఉంటాయని, ఎప్పటికప్పుడు ఉద్యోగులు అప్డేట్ కావలసిన అవసరం ఉంటుందన్నారు. తెలియని విషయాలు […]
Moreప్రభుత్వ పథకాల ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 20/06/2025జిల్లాలో రీ సర్వే పూర్తికాబడిన గ్రామాలలో జాయింట్ ఎల్.పి.ఎం ల కారణంగా ప్రభుత్వ పథకాలను పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రీసర్వే పూర్తి కాబడిన గ్రామాలలో జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన రైతులు అన్నదాత సుఖీభవ”, “తల్లికి వందనం” మొదలైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనికి […]
Moreజిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు యోగ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 20/06/2025జిల్లాలోని అన్ని ప్రాంతాలలో జూన్ 21న ఒకే సమయంలో యోగా కార్యక్రమాలు.. జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ నందు 5 వేల మందితో మెగా యోగాకు భారీ ఏర్పాట్లు.. జిల్లాలో 8 లక్షల 80 వేల మంది యోగ రిజిస్ట్రేషన్లు, 4,835 ప్రదేశాలలో యోగా నిర్వహణ.. యోగా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగే విధంగా మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లావ్యాప్తంగా జూన్ 21 శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా […]
Moreఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.
Published on: 20/06/2025అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న యోగ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవోలు, తహాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న యోగా కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని సంబంధిత అధికారులు మండల స్థాయి అధికారుల సమన్వయంతో పనిచేసి 21వ తేదీన 4,835 లొకేషన్స్ లో జరిగే […]
More