మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
Published on: 10/02/2026జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి.. రానున్న ఉగాది నాటికి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి… ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిలో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలి.. మున్సిపల్ కమిషనర్లు పబ్లిక్ టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ […]
Moreప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ-ఆఫీస్ ద్వారానే పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 10/02/2026ప్రభుత్వ కార్యాలయాల నుండి ఇకపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలి. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం ఈ-ఆఫీస్ నిర్వహణపై రెవిన్యూ అధికారులకు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఇకపై ప్రతి ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని […]
Moreసంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కష్టించి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
Published on: 09/02/2026రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఆయా జిల్లాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
Moreజిల్లాలో వెట్టిచాకిరి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 09/02/2026వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకిరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు 50 సంవత్సరాలు పూర్తయి సందర్భంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవ ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 50 సంవత్సరాల […]
Moreఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో ప్రజలకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 09/02/2026ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నుండి 13 వ తేదీ వరకు నిర్వహించుచున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు 2026 ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు అవగాహన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు […]
Moreప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి-రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు
Published on: 08/02/2026రైతులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసిఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి రూ.28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర […]
Moreప్రభుత్వం రాజ ముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 07/02/2026పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. తణుకు మండలం తేతలి గ్రామ పంచాయతీ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకంలో అన్ని […]
Moreపారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, ఆదాయం పెరుగుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 07/02/2026రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలి బియ్యం మిల్లింగ్లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగిస్తే రైస్ మిల్లర్లు వ్యాపారం ద్వారా మరింత ఆర్థికంగా బలపడతారు బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా విలువను సృష్టించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, రైస్ మిల్లల్లో అందిపిచ్చుకోవాలి… సాంప్రదాయ మిల్లింగ్ నుండి రైస్ మిల్లర్లు వినూత్నంగా ఆలోచనచేసి వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందాలి కాళ్ల మండలం పెద్దఅమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు శనివారం రైస్ మిల్ […]
Moreప్రభుత్వమే స్వయంగా మెనూను రూపొందించి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని అందిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/02/2026క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అందిస్తుంది.. వసతి గృహాల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలి… ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది.. విద్యార్థులకు స్వయంగా రాత్రి భోజనాన్ని వడ్డించిన కలెక్టర్. ఆకివీడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా వసతి గృహాలకు హాజరు అవ్వాలని, మీ […]
Moreవరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవనం పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/02/2026పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించిన హార్టికల్చర్ కాన్ క్లేవ్ – 2026 ఆధునిక పద్ధతులలో అధిక విలువలు కలిగిన కూరగాయలు, పువ్వుల రక్షిత సాగు మరియు కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు ఔత్సాహిక రైతులు ముందుకు రావాలి… సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరుకు ఉద్యానవన శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది… పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టౌన్ హాల్ నందు శుక్రవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో […]
More