• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Press Release

Filter:

సమాజంలో స్థూలంగా జరిగే అభివృద్ధిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు “స్త్రీ శక్తి పథకం” ప్రవేశపెట్టడం జరిగిందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు

Published on: 15/08/2025

శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో “స్త్రీ శక్తి” ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ […]

More

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించిన‌ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.

Published on: 15/08/2025

అంగరంగ వైభవంగా 79 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు ఆర్థిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి పిలుపు. భీమవరం కలెక్టరేట్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో శుక్రవారం నిర్వ‌హించిన‌ 79వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగరంగ వైభవంగా జ‌రిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి వంద‌న సమర్పణ చేశారు. ప‌రేడ్ క‌మాండర్ ఆధ్వ‌ర్యంలోని […]

More

జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన -జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు .

Published on: 14/08/2025

భీమవరం బాంబే స్వీట్స్ కూడలిలోని గాంధీజీ విగ్రహం వద్ద దాత బాంబే స్వీట్స్ యాజమాన్యం దాత పొత్తురి బాపిరాజు సొంత ఖర్చులతో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి లాన్, మొక్కలు ఏర్పాటు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్, బ్యాక్ డ్రాప్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సేవా తత్పరతతో కూడిన నమ్మకమైన వైద్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 14/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. హాస్పటల్ ప్రాంగణమంతా కలియతిరిగి అనువణువునా పరిశీలించారు. గత రెండు సమావేశాలలో హాస్పటల్ అభివృద్ధిపై సూచించిన పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి అని తెలుసుకొని డ్రైనేజీ పనులను, టాయిలెట్ల నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని బయో కెమిస్ట్ ల్యాబ్, ప్రసూతి వార్డు, అత్యవసర చికిత్స విభాగం, స్త్రీల శస్త్రచికిత్స వార్డు, హై డిఫెన్స్ వార్డు, పెడియాట్రిక్స్ వార్డు, ఆప్తలమిన్ వార్డు, పురుషుల […]

More

వసతి గృహ నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 14/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కురిసిన అధిక వర్షాలు కారణంగా వసతి గృహంలోనికి కొద్దిపాటి నీరు చేరడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై దగ్గర్లో ఉన్న ప్రభుత్వ బిసి కళాశాల బాలికల వసతి గృహానికి తరలించి తాత్కాలికి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. వసతి గృహంలోనికి నీరు ప్రవేశించిన సమయంలో వసతి గృహ సంక్షేమ […]

More

భారీ వర్షాలు కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 14/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం లేనందున నీరు తొలగితే పంటకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా సగటు వర్షపాతం 90 మిల్లీమీటర్ల కాగా బుధవారం ఒక్క రోజునే 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం […]

More

చిరు వ్యాపారులు సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తెలిపారు

Published on: 13/08/2025

బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామ సమైక్య భవనం నందు డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిరు వ్యాపారులకు “సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్స్” కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళల కోసం మహిళలు రుణాలు మంజూరు చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక మన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీల […]

More

ఈ-పంట డిజిటల్ క్రాఫ్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 13/08/2025

ఈ-పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రతి రైతు ఈ-పంటలో నమోదు కావాలి   గణపవరం మండలం కేశవరం గ్రామంలో బుధవారం ఖరీఫ్ 2025 ఈ-పంట డిజిటల్ క్రాఫ్ బుకింగ్ నమోదును కార్యక్రమమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ-పంట నమోదు ఎలా చేస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారా అని ఆరా తీశారు. సర్వే నెంబర్లు […]

More

మహిళా సమైక్య సభ్యులు వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికపురోభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Published on: 13/08/2025

బుధవారం ఉండి మండలం మహాదేవపట్నలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘంకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ.8.75 లక్షల సబ్సిడీతో మంజూరుచేసిన రూ.25 లక్షల వ్యయంతో నెలకొల్పిన “స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని” రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారుచేసే చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. […]

More

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం కావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/08/2025

ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫలను ‘హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మన ప్రధాని మోదీ […]

More