Close

Press Release

Filter:

ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 08/01/2026

వినియోగదారుల నుండి అధిక ధరలు అదనపు చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవు ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆకివీడు ఓంజేఎన్టి హెచ్.పి గ్యాస్ డీలర్ వద్ద ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీ లు, ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ […]

More

ప్రతి నెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 08/01/2026

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత, రుచికరమైన భోజనాన్ని అందించాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం – పీఎం పోషణ, జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ […]

More

జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ గుత్తేదారుడు ముందుకు వెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 07/01/2026

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ […]

More

భవ్య భీమవరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే మరిన్ని ప్రాజెక్టులను తీసుకురానున్నాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/01/2026

భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ నందు బోటు షికార్ ప్రారంభం… పెద్దలను, పిల్లలను ఆహ్లాదపరచనున్న బోటు షికారు.. భీమవరం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బుధవారం రెండవ బోటు షికారును నేడు అడ్వర్డు ట్యాంక్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పి ఏ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి వాటర్ పెడల్ బోట్ షికారు ను ప్రారంభించి, కొద్ది సమయం […]

More

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయి, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 06/01/2026

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవ్ డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 83310 56742 కు తెలియజేయాలి. కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో యూరియా లభ్యత, అమ్మకం ధరలు, […]

More

రైతు బజార్ లో కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు ధరలు, రైతుబజార్ నిర్వహణ, వినియోగదారులతో రైతుల ప్రవర్తనపై ప్రజాభిప్రాయం సేకరణ సంతృప్తికరంగా ఉంది–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/01/2026

భీమవరం రైతు బజార్లో వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు ప్రతి దుకాణం ముందు క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు భీమవరం రైతు బజార్ లో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు, రైతు బజారుల నిర్వహణ, పరిశుభ్రత పై ప్రజల నుండి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదులు బాక్స్ ను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు ఓపెన్ చేసి […]

More

నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 86 దరఖాస్తులు స్వీకరణ–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/01/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, […]

More

ఆర్డీవోలు ప్రతిరోజు రెండు గ్రామాలలో పర్యటించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/01/2026

రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ఒక ప్రత్యేక డ్రైవ్ గా పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో రెవెన్యూ అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో సమస్యలపై పై మండలాల వారీగా సంబంధిత ఆర్డీవోలు,తహసిల్దార్లతో […]

More

రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూమి రికార్డుల్లో తప్పులను సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Published on: 03/01/2026

గణపవరం మండలంలోని సిహెచ్ అగ్రహారం చిలకంపాడు స్కూలు వద్ద శనివారం ఏర్పాటుచేసిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని 20 మందికి పట్టాదారు పాస్ పుస్తకములు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రీ సర్వే పూర్తి చేసిన గ్రామాలలో […]

More

విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చదువుతోపాటు నైపుణ్యం ఎంతో అవసరం అని రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు.

Published on: 03/01/2026

భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన కెరీర్ ఎగ్జిబిషన్ పోటీలను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, సమగ్ర శిక్ష పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా […]

More