అత్యధికంగా రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాను అమెరికా ఆంక్షలు నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు.
Published on: 10/04/2025గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమన్వయంతో సమీక్షించడం జరిగింది. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఎంఎల్సీ వంకా రవీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు […]
Moreబాలలతో బిక్షాటన చేయించిన, ఇతర పనులకు వినియోగించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.
Published on: 09/04/2025మంగళవారం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లతో సమావేశమై బాలల సంరక్షణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాలలను భిక్షాటనకు వినియోగిస్తే తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల సంక్షేమానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని, ఇటువంటి చర్యలు ఉపేక్షించేది లేదన్నారు. అలాగే ప్రతి ఒక్క […]
Moreపిజిఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.
Published on: 07/04/2025సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీదార్లవద్ద నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమావేశమై మాట్లాడుతూ నిర్ణీత గడవులోపుగా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, అధికారులు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించాల్సిందేనని […]
Moreరైతులకు నచ్చిన మిల్లులకు ధాన్యం విక్రయించుకునే విధంగా వెసులుబాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 05/04/2025శనివారం భీమవరం మండలం తుందూరు గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, పులపర్తి రామాంజనేయులు, ధాన్యం కొనుగోలు కేంద్రం, ధాన్యం లోడు వాహనమును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రబీ సాగులో జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు ద్వారా ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుండి ధాన్యం […]
Moreవేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు త్రాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
Published on: 05/04/2025జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలి. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పిఎం సూర్యఘర్, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు, పార్కుల అభివృద్ధి అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ నుండి చెత్త సేకరణ బాగానే జరుగుతుందని, కానీ తడి, పొడి చెత్త వేరు […]
Moreబడుగు బలహీన వర్గాల సంక్షేమం, కార్మికుల అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు .
Published on: 05/04/2025బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవాలను పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిని వెలిగించి వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]
Moreపీఎం లంక అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని విధాల చర్యలు చేపట్టారని, పిల్లలను పాఠశాలకు విధిగా పంపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 04/04/2025శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెదమైనవానిలంక డిజిటల్ భవనాన్ని, పీఎం లంక సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతంలో డెలాయిట్ కంపెనీ చేపట్టనున్న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు తదితరులు ఉన్నారు. తొలుత డిజిటల్ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని […]
Moreజాబ్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా అధికారులను ఆదేశించారు.
Published on: 04/04/2025శుక్రవారం నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ నందు ఉపాధి హామీ పనులను, లక్ష్మణేశ్వరం హౌసింగ్ కాలనీ ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న సమయంలో ఉపాధి కూలీలను జిల్లా కలెక్టర్ పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులకు ఇబ్బంది ఏమైనా ఉందా, అవసరమైన వారికి పనులు కల్పిస్తున్నారా, డబ్బులు సకాలంలో […]
Moreనరసాపురం ప్రాంత ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చైతన్యవంతులు కావాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్త నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 04/04/2025శుక్రవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన “పరిశుభ్ర నరసాపురం” కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు, శానిటరీ వర్కర్స్ తో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నరసాపురం డంపింగ్ పెద్ద సమస్యగా మారిందని, గోదావరి నది ఒడ్డున డంపింగ్ చేయడంతో భూమి, వాయు, నీరు కాలుష్యం అవుతున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిశీలించి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ చర్యలకు పూనుకున్న సందర్భంలో, కొంత […]
Moreనియోజవర్గాల వారి అభివృద్ధి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 04/04/2025గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ – 2047 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యంగా మన జిల్లా వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి ఉందని, జిల్లాలో వరి సాగు 4.25 లక్షల ఎకరాల్లో చేపట్టడం జరిగిందని, దీని ద్వారా 15 […]
More