Close

News

రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను లోటుపాట్లకు తావు లేనివిధంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 06/01/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్య, వైద్య, పోలీస్, పంచాయతీ, ఫైర్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, తదితర శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లను ఐదో తేదీ ఆదివారం […]

More

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Published on: 06/01/2025

శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని ఉన్న 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లులో మరఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హమాలీలను సమకూర్చుకొని బియ్యం దిగుమతి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. గిడ్డంగుల నిర్వహణలో ఏటువంటి అవకతవకలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు పంపవలసిన బియ్యాన్ని […]

More

జిల్లాలో జనవరి 6 నుండి మంచానికి, వీల్ చైర్ కి పరిమితమైన పింఛనుదారుల తనిఖీలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 06/01/2025

జిల్లాలో 1,510 మంది పెన్షనర్లు రూ.15,000/- లు చొప్పున పింఛన్ ను అందుకుంటున్నారని, వీరందరూ మంచానికే పరిమితమై లేదా విల్ చైర్ క్యాటగిరిలో పింఛన్లు పొందడం జరుగుతుందని, ఇటువంటి వారిని వారి ఇంటి వద్దనే షెడ్యూల్ ప్రకారం జనవరి 6 నుండి జనవరి 31 వరకు వెరిఫికేషన్ చెయ్యండి జరుగుతుందని తెలిపారు. వీరికి ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్ ల కార్యాలయాల నుండి ముందుగా ఇంటిమేషన్ లెటర్స ను అందజేయడం జరుగుతుందన్నారు. పింఛన్ల తనిఖీ నిమిత్తం జిల్లాలో డివిజన్ […]

More
2

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 04/01/2025

జిల్లాలో ఎన్ హెచ్-165 కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పామర్రు-దిగమర్రు నేషనల్ హైవే-165 భూ సేకరణలో భాగంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన భూములకు సంబంధించి భూసేకరణ అధికారి మరియు భీమవరం ఆర్డీవో తయారుచేసిన అవార్డులపై నేషనల్ […]

More

మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 04/01/2025

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద జనవరి 6వ తేదీన గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించడంతోపాటు ప్రజల […]

More

జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై విద్యార్థిగా మారిన వేళ

Published on: 19/12/2024

ఉండి మండలం పాందువ్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఎంతమంది చదువుకుంటున్నారు, హై స్కూల్ చదువుకు ఎక్కడికి వెళ్తున్నారు, ఒక కుటుంబంలోని పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారా, వేరువేరుగా చదువుకుంటున్నారా తదితర సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటే తరువాతి తరగతులు సులభంగా చదవగలుగుతారని ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో పిల్లలకు విద్యతో పాటు, మంచి అలవాట్లను నేర్పాలని సూచించారు. చిన్నతనంలో […]

More

భూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి, వీలైనంత‌వ‌ర‌కు త‌క్ష‌ణ పరిష్కారానికి దృష్టి సారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 19/12/2024

ఉండి మండ‌లం పాందువ్వ గ్రామంలో గురువారం నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుకు జిల్లా కలెక్టర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రామ ప్రజ‌ల‌ నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను క‌లెక్ట‌ర్‌ ప‌రిశీలించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి వెంకటనారాయణ దరఖాస్తు అందజేస్తూ నాకు 50 సెంట్లు భూమి వాస్తవంగా ఉండాలని ప్రస్తుతం 44 సెంట్లు మాత్రమే లెక్కలోకి వస్తుందని నాకు సంబంధించిన ఆరు సెంట్లు భూమి బొడ్డుపల్లి చెన్నయ్య కు కలిసిందని, తగిన న్యాయం చేయాలని కోరారు. వేగ్నేశన లక్ష్మీ […]

More

పశువుల షెడ్ల నిర్మాణాల లక్ష్యంలో వెనుకబడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు

Published on: 19/12/2024

గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, అంగన్వాడీ పిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్, మిస్సింగ్ హౌస్ డేటా ఎన్రోల్మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్.పి.సి.ఐ నమోదు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణ లక్ష్యంగా రూ.18.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు ఇప్పటివరకు కేవలం 50 షెడ్లను మాత్రమే పూర్తి చేయడంపై […]

More

భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకును డిసెంబర్ 20న ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 19/12/2024

సుశేణా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇతర ముఖ్య భాగస్వాముల సహకారంతో తల్లిపాల బ్యాంకును భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి సుశేణా హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి స్టేట్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ లక్కర్సు, డిసిహెచ్ఎస్ డాక్టర్ సూర్యనారాయణ అందజేశారు. తల్లులకు సమగ్ర లాక్టేషన్ మద్దతు అందించడానికి, […]

More

జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు

Published on: 19/12/2024

గురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డులు, బ్లాకులు సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సర్వే నెంబర్లు వారీగా ఈసీ డేటా తీసుకొని నిర్ధారించాలన్నారు. కొత్తగా వచ్చిన డోర్ నెంబర్లు సేకరించాలని తెలిపారు. […]

More