ప్రస్తుత రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా కేంద్రాల ద్వారా 55,983 మంది రైతులు వద్ద నుండి 5.21 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమును కొనుగోలు
Published on: 08/05/2025రూ.1,200 కోట్లకు గాను రూ.1,130 కోట్లు రైతులు ఖాతాలో డబ్బులు జమ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ మరియు గన్ని బ్యాగులు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024- 25 సంవత్సరం రబి సాగుకు సంబంధించి జిల్లాలో 263 రైతు సేవా […]
Moreపశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రెండు రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ అవార్డులకు ఎంపిక…
Published on: 07/05/2025విజయవాడ రాజ్ భవన్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఆహ్వానం మే 8న రాష్ట్ర గవర్నర్ చేతులు మీదుగా అవార్డులను అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు చదలవాడ నాగరాణి అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా 2023-24, 2024-25 సంవత్సరాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రెడ్ క్రాస్ అవార్డులతో సత్కరించడానికి ఎంపిక చేయడం […]
Moreమిల్లుల వద్ద ధాన్యం లోడులు దిగుమతుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ అన్నారు.
Published on: 07/05/2025మంగళవారం పెంటపాడు మండలం ఆకుతీగలపాడు విజయ కృష్ణ రైస్ మిల్లు, దర్శిపర్రు రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం లోడులు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన బియ్యం డెలివరీలు పూర్తి చేయాలని ఆవేశించారు. దర్శిపర్రు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో సాగు వివరాలు, ధాన్యం వివరాలు, గోనే సంచుల […]
Moreమత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిరంతరం రైతులకు సూచనలు ఇస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/05/2025చేపలు, రొయ్యలు సాగులో ఎటువంటి యాంటీ బయటిక్ మందులు వాడరాదు, టెక్నాలజీని ఉపయోగించాలి.. మంగళవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉండి మత్స్య పరిశోధన కేంద్రం నందు ఆక్వా రైతులకు ఆక్వా పద్ధతులు నిర్వహణ మరియు నైపుణ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వాకల్చర్ లో మంచి యాజమాన్య […]
Moreకౌలు రైతులకి విరివిగా రుణాలను అందించాలి. పిఎంజెజెబివై, పి.ఎం ఎస్ ఎస్ వై, బీమా పథకాలలో ప్రతి ఒక్కరూ నమోదు అయ్యేలా చూడాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 06/05/2025మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం (జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం మరియు జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పథకాల లక్ష్యసాధనకు ప్రతి బ్యాంకు తమవంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాల మంజూరుకు బ్యాంకర్లను ఆదేశించారు. విద్య, గృహ రుణాలను […]
Moreరైతులు అధైర్య పడవలసిన అవసరం లేదని ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Published on: 06/05/2025మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని వశిష్ట సమావేశం మందిరం నందు మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురౌతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం ఉభయ పశ్చిమగోదావరి […]
Moreఅకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, రేపు సాయంత్రం లోపుగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Published on: 05/05/2025గత రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే […]
Moreపిజిఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Published on: 05/05/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసి అర్జీని సమర్పించుకునేందుకు పూర్తి అంగవైకల్యం కలిగిన బిడ్డను ఎత్తుకొని వచ్చిన దంపతుల వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పాప అంగవైకల్యంపై ఆరా తీస్తూ దివ్యాంగుల పెన్షన్ […]
Moreజిల్లాలో నీట్ యూజీ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని, 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 05/05/2025పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన రెండు నీట్ యూజీ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. నిట్ లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 1,128 పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 739 మంది పరీక్షలు హాజరయ్యారు. మొత్తం […]
More