• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

News

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 01/09/2025

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్ సొమ్మును వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వృద్ధులు, వికలాంగులకు, పింఛను సొమ్మును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు గౌరవంగా బ్రతకాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును ప్రతినెల ఒకటవ […]

More

ఉల్లి రైతులను ఆదుకోవడానికి హోల్ సేల్ వ్యాపారస్తులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 01/09/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి వ్యాపారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను మానవతా దృక్పథంతో నష్టకాలంలో ఆదుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత వ్యాపారులపై ఉందని అన్నారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాలు కారణంగా కొంత దెబ్బతిన్నాయని, స్థానిక హోల్ సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో […]

More

ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నదని, భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతోకొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 01/09/2025

సోమవారం తాడేపల్లిగూడెం సావిత్రు పేటలో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను ఈ రోజు సెప్టెంబర్ 1న వేకువజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 2,26,513 […]

More

కులమతాలకు అతీతంగా శాంతి, సౌబ్రాతృత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో పర్వదినాలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Published on: 31/08/2025

ఆదివారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా […]

More

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 30/08/2025

శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని డివిజన్, మండల స్థాయి రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రీ సర్వే,22 ఏ,అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు,క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు,తహసిల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు పేజ్- 1 లో పెండింగ్ […]

More

తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు

Published on: 30/08/2025

శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్షించడం జరిగింది. జిల్లాలో ఈ సంవత్సరం జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి చనిపోతే పిల్లలు కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రసూతి వైద్యులు నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. […]

More

జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 30/08/2025

శనివారం భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వెర్షన్ 2.0 పై (పిఎఐ 2.0) నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్” కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధికి 193 దేశాలు కూడుకొని ఒక సూచికను రూపొందించడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక దేశాలలో కొన్ని అంశాల్లో అభివృద్ధి […]

More

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 30/08/2025

శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అధారిటీ కమిటీ సమావేశంలో పి సి & పి ఎన్ డి టి యాక్ట్ అమలు, ఏ ఆర్ టి అండ్ సరోగసి యాక్ట్ అమలుపై సమీక్షించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న తీర్మానాలు కార్యాచరణపై చర్చించడం జరిగినది. అనంతరం జిల్లాలో పి సి & పి ఎన్ డి టి యాక్ట్ […]

More

తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 30/08/2025

శనివారం తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయలను పరిశీలించారు. కర్నూలులో రైతులు పండిస్తున్న ఉల్లిపాయకు కనీసం మద్దతు ధర రాకపోవడంతో మద్దతు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మన జిల్లాలో తాడేపల్లిగూడెం బ్రహ్మానందం రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి […]

More

రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 29/08/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్యశాఖ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. […]

More