Close

News

గృహహింస, మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/10/2025

బాలల సంరక్షణ సంస్థలు వారికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా స్వశక్తితో జీవించే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బాల్య వివాహాల నిరోధానికి ప్రజలకు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లాలో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]

More

భవిష్యత్తులో నీటి ముంపుకు గృహాలలో నీళ్లు చేరాయి అనే మాట వినిపించని విధంగా శాశ్వత చర్యలు ఉండాలని అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/10/2025

భీమవరం రూరల్ లో తుఫాన్ కారణంగా ముంపు గురైన ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. గూట్లపాడు శివారు, కొత్త పూసల మర్రు, దొంగపిండి ప్రాంతాలు కొద్దిపాటి వర్షాలకే నీటి ముంపుకు కారణాలను తెలుసుకునేందుకు ఉప్పుటేరులో పంటుపై ప్రయాణం ఉప్పుటేరులో గంటసేపు పంటులో ప్రయాణించి స్లూయిస్ ని చేరుకొని క్షేత్రస్థాయిలో స్లూయిస్ పరిశీలన.. వెంటనే స్లూయిస్ ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు ముంపు ప్రాంతాలలో శాశ్వత చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, ప్రస్తుతం చేయగలిగిన పనులను వెంటనే […]

More

“మొంథా తుపాను” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధతో జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించగలిగాం..

Published on: 30/10/2025

జిల్లాలో భారీ వర్షాల కారణంగా నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తాయి.. ……కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుఫాన్ బాధితులకు బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం 25 కేజీలు, […]

More

తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

Published on: 30/10/2025

తుఫాను ప్రభావిత ప్రాంతాల కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, కందిపప్పు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఒక్కొక్క కేజీ చొప్పున, పామ్ ఆయిల్ ఒక లీటర్ చొప్పున మొత్తం కిట్ ల పంపిణీ నేటి నుండి ప్రారంభం గురువారం పెంటపాడు మండలం రావిపాడులో వరద బాధితులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్మడం ద్వారా లాభం పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 30/10/2025

గురువారం పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించగా, ధాన్యములోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన […]

More

పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల మేరకు రైతులకు సహాయం అందించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Published on: 30/10/2025

గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయ పాలెం, పెంటపాడు మండలంలోని రావిపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాలలో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్ట పోయామని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, పంట తయారైన తర్వాత యంత్రం ద్వారా కొయ్యడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే […]

More

” మొంథా తుపాను” ను పూర్తి సన్నద్ధతతో 24 గంటల విధులలో నిమగ్నమై అహర్నిశలు పనిచేసిన జిల్లా, డివిజనల్, మండల, సచివాలయ అధికారులకు సిబ్బందికి నా కృతజ్ఞతలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 30/10/2025

తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు పత్యేక శ్రద్ధ పెట్టాలి. ముంపు ప్రాంతాలలో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి బాధితునకు బియ్యం, నిత్యవసర సరుకులు తక్షణమే అందించాలి. తుఫాను అనంతరం పరిస్థితులపై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, […]

More

నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 29/10/2025

భీమవరం మండలం చిన్నఅమీరం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా నీటమునిగిన వరి పొలాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తుఫాను కారణం నీట మునిగిన వరి పొలాలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 5,984 ఎకరాలు వరి పంటకు గాను 1,689 రైతులకు సంబంధించిన 3,340 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను […]

More

రైతులకు ఇబ్బంది లేని విధంగా సాగునీరు సాఫీగా పారేందుకు రానున్న రెండు నెలల్లో కాలువలు, డ్రైయిన్లు ఆక్రమణలను నూరు శాతం తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Published on: 29/10/2025

బుధవారం ఉండి మండలం వాండ్రం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా బలమైన గాలుల ప్రభావంతో నేలకొరిగిన వరి పంటను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాండ్రం గ్రామంలోని 600 ఎకరాలకు సంబంధించిన నీరు ఇసుక డ్రెయిన్ ద్వారా వెళ్లవలసి ఉంటుందని, డ్రెయిన్ కుంచించుకుపోవడంతో సాగునీరు సాఫీగా పారుదల లేక పంట నష్టపోతున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా ఈ […]

More

మీకు పెట్టే భోజనమే నేను తింటా.. మీతోనే మేము.. ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 29/10/2025

కలెక్టర్ అమ్మ.. తుఫాన్ బాధితులతో సహపంక్తి భోజనం… కుశల ప్రశ్నలు.. ప్రజలకు ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం అండగా నిలుస్తుంది … పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా.. నరసాపురం మండలం పెద్దమైన వానిలంక డిజిటల్ భవన్, వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్, మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల సందర్శన, ఆశ్రయం పొందిన వారితో ఏర్పాట్లపై ఆరా.. తుఫాను […]

More