Close

News

రైతు బజార్ లో కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు ధరలు, రైతుబజార్ నిర్వహణ, వినియోగదారులతో రైతుల ప్రవర్తనపై ప్రజాభిప్రాయం సేకరణ సంతృప్తికరంగా ఉంది–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/01/2026

భీమవరం రైతు బజార్లో వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు ప్రతి దుకాణం ముందు క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు భీమవరం రైతు బజార్ లో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు, రైతు బజారుల నిర్వహణ, పరిశుభ్రత పై ప్రజల నుండి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదులు బాక్స్ ను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు ఓపెన్ చేసి […]

More

నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 86 దరఖాస్తులు స్వీకరణ–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/01/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, […]

More

ఆర్డీవోలు ప్రతిరోజు రెండు గ్రామాలలో పర్యటించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/01/2026

రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ఒక ప్రత్యేక డ్రైవ్ గా పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో రెవెన్యూ అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో సమస్యలపై పై మండలాల వారీగా సంబంధిత ఆర్డీవోలు,తహసిల్దార్లతో […]

More

రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూమి రికార్డుల్లో తప్పులను సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Published on: 03/01/2026

గణపవరం మండలంలోని సిహెచ్ అగ్రహారం చిలకంపాడు స్కూలు వద్ద శనివారం ఏర్పాటుచేసిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని 20 మందికి పట్టాదారు పాస్ పుస్తకములు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రీ సర్వే పూర్తి చేసిన గ్రామాలలో […]

More

విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చదువుతోపాటు నైపుణ్యం ఎంతో అవసరం అని రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు.

Published on: 03/01/2026

భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన కెరీర్ ఎగ్జిబిషన్ పోటీలను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, సమగ్ర శిక్ష పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా […]

More

మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 03/01/2026

క్రీడాజ్యోతి ని వెలిగించి నేడు ఘనంగా ప్రారంభించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడలు… నేడు, రేపు రెండు రోజులపాటు డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్న క్రీడలు. 9 క్రీడాంశాలలో పాల్గొననున్న 235 బృందాలు… 56 మంది అథ్లెటిక్స్… స్వయంగా ఆటలు ఆడి క్రీడా స్ఫూర్తిని రగిలించిన జిల్లా కలెక్టర్. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గోదావరి క్రీడా ఉత్సవాలు శనివారం కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా స్థాయి పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

సచివాలయంలో అర్జీదారు దరఖాస్తు సమర్పణలో వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సంతకం కావాలని డిజిటల్ అసిస్టెంట్ లు ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు తిరస్కరించకూడదని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు.

Published on: 02/01/2026

రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ అంశాలపై శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ […]

More

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 02/01/2026

జిల్లాలో జనవరి 1వ తేదీ నుండి నుండి 31 వరకు జాతీయ రోడ్ భద్రత మాసోత్సవం నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 2026, సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా రోడ్డు భద్రత గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు […]

More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 02/01/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను సంబంధిత శాఖలు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, […]

More

భూ సమస్యల పరిష్కరించడానికి సర్వే పూర్తయిన వాటికి కొత్త పాసు పుస్తకాలు నేటి నుండి పంపిణీ–రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు

Published on: 02/01/2026

రెవిన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి.. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది… శుక్రవారం కాళ్ల మండలం పెద్దఆమిరం గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామసభలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘు రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ముఖ్య అతిథులుగా పాల్గొని 22 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకములను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు కూటమి […]

More