నిత్యవసర వస్తువులు నిలువలు ఉంచడం, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను బలోపేతం చేయడానికి అవసరమైన మెటీరియల్ సిద్ధం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అంతట పూర్తి అప్రమత్తతతో అధికార యంత్రాంగం సన్నద్ధమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
రానున్న తీవ్రమైన మొంథా తుఫాను ధృష్ట్యా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జిల్లాలోని 07 అగ్ని మాపక కేంద్రాల పరిధిలోని 90 మంధి సిబ్బంధి అంధరిని అప్రమత్తంగా వుంచడంతో పాటు, అగ్ని మాపక వాహనములు మరియు అత్యవసర పరికరములు అన్నింటిని సిద్ధంగా వుంచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 07 అగ్ని మాపక వాహనములు, 10 నీటిని తోడే యంత్రములు, 80 లైఫ్ జాక్కెట్స్, 40 లైఫ్ బాయ్స్, 30 రోప్ లు, చెట్లను నరకడానికి ఉపయోగించే యంత్రాలు 12 సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెట్లను నరకడానికి 12 బృంధాలతో 24 మందిని నియమించడం జరిగిందని తెలిపారు. అలాగే పునరావస కేంద్రాలను గుర్తించి సిద్ధం చేయడంతో పాటు మెడికల్ క్యాంపులను కూడా ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాను గాలులు సందర్భంగా పశువులలో వచ్చే గొంతు వాపు వ్యాధిని అరికట్టేందుకు ఈ హెచ్.ఎస్ వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. నిత్యవసర వస్తువులకు ఇబ్బంది లేని విధంగా అవసరమైన స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆహార పదార్థాలను ముందస్తుగా నిల్వ ఉంచడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219, భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315, నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874, తాడేపల్లి ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేయుటకు, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. తుఫాను పరిస్థితులు చక్కపడే వరకు 24/7 కంట్రోల్ రూమ్ పని చేస్తాయన్నారు.