బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని ఈవిషయంలో ఎవరినీ బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు,జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాల్లో పిపిపి విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగష్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10 లక్షల 10వేల బంగారు కుటుంబాలను లక్షా 12వేల మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు.బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు ద్వారా కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసస్మెంట్ సర్వే ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు.స్వర్ణ ఆంధ్ర పి-4 కు సంబంధించి ఇప్పటికే సియం స్థాయిలో అందరు ప్రజాప్రతిధులు, అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని కావున దీనిపై ఎలాంటి సందేహాలకు అవకాశం లేదని అన్నారు.అంతేగాక పి-4పై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హేండ్ బుక్ ను కూడా రూపొందించి అందరు జిల్లా కలక్టర్లకు షేర్ చేయడం జరిగిందని దానిలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుని ఆప్రకారం ఈకార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ హేండ్ బుక్ ను క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందికి కూడా షేర్ చేయాలని సిఎస్ అన్నారు. అనంతరం జిల్లాల్లో పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్పు ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో భూమిని గుర్తించాలని కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈప్రాజెక్టులు ఏర్పాటుకు సంబంధించి బజ్డెట్లో తగిన నిధులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని కావున దీనిపై కలక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.పట్టణ స్థానిక సంస్థల్లో ఈప్రాజెక్టులు ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించి ఆవివరాలను ppp.nidhi.apcffs.in అనే వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 2027-28 నాటికి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు వంతున 175 నియోజవక్గాల్లో 175 ఎంఎస్ఎంఇ ప్రార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికల గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ జిల్లాల్లో ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించాలని కలక్టర్లకు సూచించారు.ఇప్పటికే 98 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటుకు తగిన భూములను కలక్టర్లు గుర్తించగా 54 పార్కులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా జరిగాయని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, సిపిఓ కే.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతా బాయి, డి సి హెచ్ ఎస్ పి సూర్యనారాయణ, జిల్లా సర్వే అధికారి జాషువా, వ్యవసాయ శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.