విద్యతోనే ఆత్మస్థైర్యం ఉంటుందని, నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత కార్యక్రమం కన్వర్జెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్య లేని వారికి ఆత్మస్థైర్యం కొరవడుతుందని, ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యత వైపు అడుగులు వేయాలన్నారు. ఎంతో చదువుకున్నవారే ఈరోజుల్లో మోసాలకు గురవుతున్నారని, అసలు నిరక్షరాస్యులుగా ఉంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల్లో ఎక్కువ మంది చదువుకు దూరంగా ఉన్నారని, అందరిని సమయాప్తపరిచి విద్యను నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% వయోజన క్రియాత్మక అక్షరాస్యత సాధించడానికి ఈ విభాగం “అక్షర ఆంధ్ర” అనే ప్రత్యేక అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా 25 లక్షల మంది అభ్యాసకులను కవర్ చేయడానికి వికేంద్రీకృత, భాగస్వామ్య మరియు సాంకేతికత ఆధారిత విధానాన్ని అవలంబిస్తుందని తెలిపారు. 15 – 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు మరియు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో సహా ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల విభాగం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కుల సర్వే-2023 ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో 15 – 59 సంవత్సరాల వయస్సు గల 2,05,207 మందిని నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 69,392 మంది నిరక్షరాస్యులు కవర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక అక్షరాస్యత విద్యను అందించడం లబ్ధిదారులు రుణాలు తీసుకోవడం, పెట్టుబడి పెట్టడం & పొదుపు చేయడం గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వారి ఆర్థికాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుందన్నారు. డిజిటల్ అక్షరాస్యత వ్యక్తులు మొబైల్ బ్యాంకింగ్, ఇ-వాలెట్లు మరియు ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించుకోవడానికి, ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి మరియు స్వయం సహాయక బృందాల సభ్యులకు సౌలభ్యాన్ని పెంచడానికి అధికారం ఇస్తుందన్నారు. క్రియాత్మక అక్షరాస్యత మహిళలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది మరియు ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు మరియు ఒప్పందాలను అర్థం చేసుకోవడానికి మరియు వడ్డీ రేట్లను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ మరియు గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది మరియు ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను కూడా నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని నిరక్షరాస్యులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ మెంబర్ కన్వీనర్ మరియు వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ రావు, సభ్యులు డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఓ ఎం.రామ్నాథ్ రెడ్డి, మెప్మా ఏవో హెప్సిబా, జిల్లా విద్యా ఏడి సత్యనారాయణ, డిపిఆర్ఓ టి.నాగేశ్వరరావు, ఐసిడిఎస్ ఈవో సిహెచ్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.