Close

జిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ 2027 నాటికి పక్కా ప్రణాళికతో పూర్తిచేసేలా సిద్ధం కావాలని కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ పుందిక్రా గోత్మరే అన్నారు.

Publish Date : 03/06/2025

సోమవారం కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలో చేపట్టబోయే జేజేఎం ప్రాజెక్టుపై కేంద్ర బృందం సభ్యులు చిన్మాయ్ పుందిక్రా గోత్మరే, కాల ఉజ్జ్వాల్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి సమీక్షించారు. తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత, ఇప్పటికే కొనసాగుతున్న వాటర్ స్కీములు, వాటి ద్వారా జరుగుతున్న నీటి సరఫరా తదితర వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా వివరించారు. అనంతరం కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ పుందిక్రా గోత్మరే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహనికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీరు అందించాలనేదే జలజీవన్ పధకం లక్ష్యం అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆరోగ్యకరమైన సురక్షిత నీటిని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ ప్రాజెక్టును జిల్లాకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రూ.1400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ అమలుకు క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు ప్రాజెక్టు ప్రారంభం కాలేదని, 2027 నాటికి ప్రాజెక్ట్ ను పక్కాగా పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తయి కుళాయిలు ద్వారా నీటి సరఫరా చేసినప్పుడు, ప్రజల నుండి యూజర్ ఛార్జీలను జాగ్రత్తగా ఫిక్స్ చేయాల్సి ఉంటుందని, వాటి ద్వారానే ప్రాజెక్టు మెయింటెన్సు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. సురక్షిత నీటిని అందజేయాలనే లక్ష్యానికి విఘాతం కలగకుండా పైప్ లైన్లను పక్కాగా నిర్మించాలని, జిల్లాలో ఆక్వా సాగు ఎక్కువగా ఉన్నందున కలుషితం కాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలతో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ కి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో కె.భీమేశ్వర్, ఎస్.ఇ ఆర్డబ్ల్యూఎస్ త్రినాథ్ బాబు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి కె.గంగాధర్ రావు, గ్రామ వార్డు సచివాలయల అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పి.డి. కె.సి.హెచ్. అప్పారావు, డి.ఎం.అండ్.హెచ్ ఓ డాక్టర్ జి.గీతాబాయి, ఇఇ పంచాయతీరాజ్ ఎస్.వి.రామన్, ఆర్ అండ్ బి ఇ.ఇ శ్రీనివాస్, ఆర్డిఏ డిపిఎం కె.శ్రీనివాస్, ఇఇ ఆర్డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, డిఇ కె.దానానంద్, తదితరులు పాల్గొన్నారు.