ప్రభుత్వ వసతి గృహాల మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేసి విద్యార్థిని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

మంగళవారం నరసాపురం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలికలు, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలు మరియు చలవపేట బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికగా తనిఖీ చేశారు. జరుగుచున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల మరమ్మత్తు పనులతోపాటు త్రాగునీరు, టాయిలెట్స్, మరియు డ్రైనేజీ సదుపాయలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య అక్కడ జరుగుచున్న పనుల ప్రగతి గురించి జిల్లా లెక్టరుకు వివరించారు. వసతి గృహాల మరమ్మత్తు పనులకు సంబంధించి 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్లాబ్ లీకెజీలు, టాయిలెట్స్, డ్రైనేజీ మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, మిగతా పనులు త్వరలో పూర్తి చేయడం జరుగుతుం దని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిగిలిన పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంలో ఆర్డిఓ దాసిరాజు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయ రాజు, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ అయితం సత్యనారాయణ, హాస్టల్ వార్డెన్లు, తదితరులు ఉన్నారు