ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడంతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు

ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 172
…..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వర రావు, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 172 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. కొన్ని పెండింగ్ ఫిర్యాదులు పరిష్కారంపై సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్ ఫిర్యాదులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సమస్యలు తమ పరిధిలోనివికానప్పుడు వెంటనే సంబందిత శాఖకు పంపాలని అధికారులను ఆదేశించారు. కెనాల్స్, డ్రైన్లు స్థలాలను ఆక్రమించి టెంపుల్స్ నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులును ఆదేశించారు. వాటిని గుర్తించి సంబంధిత తహాసిల్దార్లు సర్వే అధికారులు ద్వారాసర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలన్నారు.
ఈ రోజు పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలలో కొన్ని ఇలా ఉన్నాయి
@ పోడూరు మండలం రావిపాడు గ్రామవాస్తవ్యుడు బొమ్మిడి శ్రీనివాస్ అర్జిని సమర్పిస్తూ, గ్రామంలో తాను 209 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, నా స్థలం నుండి గ్రామపంచాయతీ సిసి రోడ్డు వరకు దారి మార్గం ఉందని చుట్టుపక్కల వారు మాకు దారి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మా భూమి సర్వే చేసి మార్గం ఏర్పాటు చేయాలని పోడూరు తాసిల్దార్ వారికీ ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్య తీసుకునేదని మా స్థలం సర్వే చేసి మార్గం చూపించవలసిందిగా కోరుతున్నారు.
@ పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన డి.వెంకట్ రెడ్డి అర్జీ సమర్పిస్తూ, తనకు ఎకరం నాలుగు సెంట్లు భూమి ఉందని, నడకదారిలో కరెంటు స్తంభం అడ్డుగా ఉందని దానిని తొలగించాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. నా స్థలంలో ఇల్లు కట్టుకోవాలని, ఇంటి మెటీరియల్ వెళ్లేందుకు దారి లేదన్నారు. కరెంటు స్తంభం తొలగిస్తే ఇల్లు కట్టుకుంటానని, తనకు న్యాయం చేయాలని కోరారు.
@ గణపవరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన ముచ్చర్ల వీరాస్వామి అర్జీని సమర్థిస్తూ, తనకు 50 సెంట్లు భూమి ఉందని, అందులో 40 సెంట్లు భూమి అమ్ముకున్నానని ఇంకా 10 సెంట్లు భూమి ఉందని ఆ భూమి వేరే సర్వే నంబర్లో కలిసిపోయిందని, సర్వే చేసి 10 సెంట్లు భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
@ తాడేపల్లిగూడెం మండలం మోదుగ గుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగన్న తనకు 90 సంవత్సరాల వయసుని పక్షవాతంతో బాధపడుతున్నానని, ఎటువంటి ఆస్తులు లేవని ప్రభుత్వం వారు ఇచ్చే పింఛన్ పోషణకు, వైద్య ఖర్చులకు సరిపోవడంలేదని పింఛను పెంచి న్యాయం చేయాలని కోరారు.
@ ఇరగవరం మండలం కావలిపురం గ్రామస్తులు బంగారు లక్ష్మణరావు అర్జీని సమర్పిస్తూ తాను గ్రామపంచాయతీలో స్వీపరుగా పనిచేసి 2014లో పదవి విరమణ చేశానని అప్పటి నుండి పింఛన్ తీసుకుంటున్నాని, జనవరి 2024 నుండి పింఛన్ రావడంలేదని, అప్పటినుండి పింఛను ఇప్పించాలని కోరారు.
@ భీమవరంనకు చెందిన పల్లంటి లక్ష్మి అర్జీని సమర్పిస్తూ, తనకు 65 సంవత్సరాలు వయస్సు అని, నా భర్త, నా కుమారుడు చనిపోయారని, నా కోడలు ఇద్దరు పిల్లల్ని నా వద్ద వదిలేసి వెళ్లిపోయిందని ప్రస్తుతం నాకు ఇల్లు లేదని, పెన్షన్ కూడా రావడం లేదని దయచేసి నాకు ఇల్లు, పింఛను ఇప్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ కె.శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఎం సివిల్ సప్లై స్ టి.శివరామ ప్రసాద్, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.