Close

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంగా మైక్రో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు–రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు

Publish Date : 09/06/2025

పెద్దఅమిరంలో ఎన్టీఆర్ కళావనం ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన..

నియోజవర్గం ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు తెలిపారు.

పెద్దఅమిరం పంచాయతీ వద్ద త్రాగునీటి సరఫరా పథకానికి నూతన మైక్రో ఫిల్టర్ బెడ్ అమరిక పనులను పూర్తిచేసీ సోమవారం రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి మైక్రో ఫిల్టర్ బెడ్ ను ప్రారంభించారు. అనంతరం గ్రామ మహిళలకు స్వచ్ఛమైన త్రాగునీటిని బిందులు ద్వారా అందజేశారు. నియోజకవర్గంలో ఎక్కడ త్రాగునీటికొరత లేకుండా స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. కాలువల్లో, డ్రైన్ లలో గృహల ద్వారా వేస్ట్ వాటర్, ఆక్వా చెరువులు నీటిని ఎట్టి పరిస్థితుల్లో కలపరాదని, ఇలా చేస్తే చర్యలు తప్పవన్నారు. చాలా రోగాలు కలుషితమైన నీటిని తాగడం ద్వారానే వస్తాయన్న విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. అనంతరం పెద్దఅమిరం సాయిబాబా గుడి సమీపంలోని పంచాయతీ స్థలంలో రూ.30 లక్షలు పంచాయతీ నిధులు, రూ.40 లక్షలు దాతల సహకారం మొత్తం రూ.70 లక్షల అంచనా వ్యయంతో “ఎన్టీఆర్ కళావనం” ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు సరైన భవనం లేకపోవడంతో భీమవరం పట్టణానికి ఆనుకుని కాళ్ల మండలం పెద్దఅమిరం పంచాయతీ స్థలంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణానికి ఆలోచన చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి సులభంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమాలలో బెంగుళూరు నుండి వచ్చిన కెనరా బ్యాంక్ ఎండి అండ్ సీఈవో కే.సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.