ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంత మయ్యాయని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు

పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంతమైన సందర్భంగా శనివారం భీమవరం పట్టణంలో వీసాకోడేరు వంతెన వద్ద నుండి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనము వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ బైక్ ర్యాలీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏ పి ఐ ఐ సి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం స్థాయిలో రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర వేలాదిమంది పౌరరులతో నిర్వహించడం జరిగిందన్నారు. పహాల్గంలో టూరిస్టులు పై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో
పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుండి మద్దతు లభించింది అన్నారు. ఈ చర్య పెద్ద ఎత్తున విజయవంతమైనదని అన్నారు. భారత్ పై దాడులకు పాల్పడితే ఏ విధముగా భారత ప్రభుత్వం స్పందన ఉంటుందో ప్రపంచ దేశాలుకు తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ రోజున భారతదేశo ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఉందని రాబోయే కాలంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతుందని అన్నారు.
ఈ అభివృద్ధిని చూడలేక కొన్ని దేశాలు భారత మీద ఒత్తిడి చేయాలని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పహాల్గాo దాడులలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు చెందిన వారు ఇద్దరు ఉన్నారని వారిలో కావలికి చెందిన మధుసూదన రావు భార్య మీనాక్షి ప్రసన్న ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగిందన్నారు. ఒక మహిళగా ఆమె మాట్లాడిన మాటలలో మేము భర్తలను కోల్పోయాము మా భర్తలను టార్గెట్ చేసి మా నుదుటున సింధూరాన్ని చెరిపేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు శిబిరాలు మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో తీసుకున్న చర్యలకు గర్వపడుతున్నామని చెప్పారన్నారు. ఆమె చెప్పిన మాటలకు నా మనసు జలదరించిందని అన్నారు. వారికి ఎప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని అన్నారు.
రాబోయే రోజులలో భారత్ పై ఇలాంటి చర్యలు పాల్పడే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రపంచానికి తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ చర్యలలో భారతదేశం ప్రయోగించిన ఆయుధాలు ప్రపంచంలో అత్యుత్తమమైన పరిణామాలు, క్వాలిటీ కలిగిన ఆయుధాలుగా ప్రపంచానికి ప్రస్ఫుటమైనదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత దేశం ఐక్యత చాటడం కోసం భారతదేశ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు తిరంగా యాత్ర వేలాదిమందితో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఐక్యతకు, న్యాయానికి, ధర్మానికి, నిబద్ధతకు మారుపేరు భారతదేశమన్నారు. పాకిస్తాన్ చేసిన దురాగతలను అరికట్టడానికి భారతదేశం కృత నిశ్చయంతో ఉంటుందని ప్రపంచ దేశాలకు భారతదేశము ఆదర్శమని ఆయన అన్నారు.
ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కోటికలపూడి గోవిందరావు, మెరగాని నారాయణమ్మ, టిడిపి, బిజెపి, జనసేన, పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు.