Close

ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పాఠశాలలు, హాస్టల్, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన, రుచికరమైన, ఆహారాన్ని అందించుటకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 11/06/2025

బుధవారం పెనుమంట్ర మండలం మార్టేరు లో శ్రీ ఎస్ వి జి ఉన్నత పాఠశాల, పొలమూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేసిన ఫైన్ వెరైటీ రైస్ ప్యాకెట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బియ్యం నాణ్యత ఎలా ఉన్నాయి, సరఫరా ఎలా జరిగాయి, వాటిని పిల్లలకు ఏ విధముగా తయారు చేసి పెట్టాలి దానిపై సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు రుచికరముగా నాణ్యతతో వంటలు తయారుచేసి పెట్టాలన్నారు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం వద్ద మెయిన్ గేటు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నందున వాహనాల రాకపోకల వలన విద్యార్థులకు ప్రమాదకరంగా ఉందని స్థానికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పరిసరాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గేటును తూర్పు వైపునున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎనకవైపుకు రోడ్డు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూ.14.50 లక్షల వ్యయంతో జరుగుతున్న వసతి గృహం రిపేరు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పిల్లవాడికి ఫైన్ క్వాలిటీ రైస్ తో భోజనం పెట్టేందుకు 15 రోజుల నుండి సివిల్ సప్లైస్, ఎడ్యుకేషన్, ఎస్సీ, బీసీ, ఎస్టీ శాఖలు కలిసి సమన్వయంతో పని చేస్తూ జిల్లాలో 1,423 పాఠశాలలకు 75 వసతి గృహాలకు సంబంధించి 25 కేజీలు చొప్పున 10 వేల ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగిందని అన్నారు. జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లలు అందరికీ మధ్యాహ్నం భోజనం కింద సన్న బియ్యంతో చేసిన అన్నం పెట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం మేరకు, ప్రతి పిల్లవానికి క్వాలిటీ ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనివలన పిల్లలందరూ పిల్లలందరూ ఇష్టముగా తింటారని అన్నారు. బియ్యం ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏ రైతు ధాన్యం పండించాడు ఎక్కడ నుండి బియ్యం వచ్చినవి అనే వివరాలు తెలుస్తాయని అన్నారు. మన జిల్లాకు బాపట్ల నుండి బియ్యం రావడం జరిగిందని అన్నారు. జిల్లాలో 80 వేల మంది విద్యార్థులకు 18 రోజులు సరిపడా బియ్యాన్ని ఇప్పటికే పాఠశాలలకు, హాస్టల్స్ కు చేర్చినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులను ఎమ్మెల్యేలను ఆహ్వానించి సన్న బియ్యంతో తయారు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ పర్యటనలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి.శివరాం ప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయ రాజు, తాహసిల్దార్ వై.రవికుమార్, ఎంఈఓ యు.నాగేశ్వరరావు, ఏఎస్ డబ్ల్యు డి.ప్రసాద్, వార్డెన్ ఎంవి సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు.