అత్యధికంగా రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాను అమెరికా ఆంక్షలు నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు.

గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమన్వయంతో సమీక్షించడం జరిగింది. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఎంఎల్సీ వంకా రవీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్ష కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు
ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికాసితభారత్ 2047 – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో నిర్వహించే కార్యాచరణ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఇప్పుడున్న సమస్యలను అధిగమించి విజయవంతంగా “ వికసిత పశ్చిమ గోదావరి జిల్లా “ గా రూపుదిద్దే స్పూర్తితో ఈ రోజు విజయవంతంగా సమీక్ష జరిగిందన్నారు.
గ్రామీణ ఉపాధిహామీపథకం :
సమీక్షలో ఉపాధిహామీపథకం ప్రస్తుత అమలు తీరు, మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం మరియు 2019 – 24 మధ్య జరిగిన అవకతవకల పైన, జిల్లాలోని ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగు నీరు కుళాయి ద్వారా ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్_జీవన్_మిషన్ అమలు తీరు పైన, 2019 – 24 మధ్య జిల్లాలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 2015-16 లో అమృత్ పథకం క్రింద ఇచ్చిన నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు మరియు పనులలో మందగమనం, అమృత్ 2.0 లక్ష్యాల పైన, గ్రామీణసడక్_యోజన, లాక్ పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎంసూర్యఘర్, కుసుమ్, పీఎంఆవాసయోజన మరియు టిడ్కో గృహాలు, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు పురోగతి పైన జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది.
ఈ సంవత్సరం ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించుకోదగిన నిధులలో 44.82 కోట్లు చెల్లింపులు జరిగాయనీ, మరో 30 కోట్లు పనులకు చెల్లింపులు జరగవలసి ఉందన్నారు. జిల్లాలో ఉపాధిహామీ వేతనాలలో 2/3 వ వంతు మేరకు మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించుకోదగిన అవకాశం ఉన్న ఈ సంవత్సరం ఇప్పటివరకు చెల్లించిన వేతనాలు దాదాపు 101.22 కోట్లు అంటే మెటీరియల్ కాంపోనెంట్ 67 కోట్ల రూపాయిల వినియోగించుకునే అవకాశం ఉంటే దాదాపు 75 కోట్లు వ్యయం జరిగినట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు, అంటే దాదాపు 30 కోట్లు వ్యయం ఎక్కువ జరిగడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. 2025 – 26 ఆర్ధిక సంవత్సరంలో మెటీరియల్ కాంపోనెంట్ పూర్తిగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ వినియోగించుకోదగిన నిధులు మరియు ఖర్చు చేసిన వివరాలను మరియు నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించడం జరిగింది, గత 5 సంవత్సరాలలో మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వారా కల్పించిన ఆస్తుల నాణ్యత మరియు నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయం పైనా విచారణ చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఒక రోజుకు ఉపాధిహామీ వేతనం రూ. 300 అయితే జిల్లాలో సగటున రూ. 268.46 , మొత్తం ఎస్సి జనాభాలో దాదాపు 65% మరియు ఎస్టీ జనాభాలో 97% ఉపాధి కూలీలు ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి . ఈ సంవత్సరం 100 రోజుల పని దినాలు పూర్తీ చేసుకున్న కుటుంబాలు 4,239 మాత్రమే. అలాగే అర్హత కలిగిన కుటుంబానికి నిర్దేశిత 100 రోజుల పనిదినాలలో సగటున 36.68 రోజుల పనిదినాలు మాత్రమే వినియోగించుకున్నందున పనిదినాల వినియోగం పెంచాలని అధికారులకు తెలపడం జరిగింది.
జల్ జీవన్ మిషన్ :
గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా 2019-24 మధ్య పనులు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోలేక పోయిందన్నారు.
2019 – 24 మధ్య నాణ్యత లేకుండా పనులు చేయడం లేదా సకాలంలో పనులు పూర్తి చేయకపోవటం మరియు పురోగతి లేని కాంట్రాక్టులు రద్దు చేసి, దీర్ఘకాలిక నీటి వనరుల ఆధారంగా పనులు పునః ప్రారంభం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. పూర్తి చేశామని లేదా కొనసాగే పనులు అని చెప్పే పనుల నాణ్యత పైన సందేహాలు నివృత్తి కావలసి ఉందన్నారు.
2019 – 24 మధ్య గత ప్రభుత్వం 1488 పనులను రూ.336.54 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి, 862 పనులు 108 కోట్లతో పూర్తిచేసి మొత్తం 3.69 లక్షల కుటుంబాలకు గాను 3.10 లక్షల కుటుంబాలకు సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా అందించబోతున్నట్లు చూపుతున్న గణాంకాలు పనులలో నాణ్యత పైన అనుమానాలు ఉన్నాయి, మిగతా 626 పనులను పూర్తి చేయడం ద్వారా మిగిలిన 59 వేల కుటుంబాలకు దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ద్వారా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా సరఫరాకు ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు తెలిపారు. అంచనా వ్యయంలో ⅓ వ వంతు ఖర్చు చేయకుండా 84% గృహాలకు నీటి కుళాయిలు పూర్తి ఎలా అవుతుంది? ఈ సమాచారం పల్స్ సర్వే ప్రకారం కాదు అని అర్ధం అవుతుందన్నారు.
జిల్లాలో మొత్తం గ్రామీణ ప్రాంతంలో పల్స్ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం సవరించిన అంచనాలను అందజేయాలన్నారు. ఇంకా 16% కుళాయిలు బిగిస్తే చాలు అన్నవిధంగా లెక్కలు ఉన్నా, పూర్తి అయినట్లు చూపిస్తున్న మొత్తం 84% కుళాయిలలో అత్యధిక భాగం నీరు రావడం లేదు అనేది నిజం , దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పల్స్ సర్వే అనంతరం ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీరు కుళాయి ద్వారా ఇవ్వాలంటే సవరించిన అంచనాలు తయారు చేయవలసిన అవసరం ఉందని అధికారులు ఇచ్చిన లెక్కలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం సకాలంలో నాణ్యతతో ప్రణాళిక బద్ధంగా పనులు చేయలేదు కాబట్టి ఇప్పుడు సవరించిన వ్యయంతో పనులు పూర్తి చేయవలసి వస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు దీర్ఘకాలిక నీటి వనరుల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు కుళాయి ద్వార సురక్షిత త్రాగు నీరు ఇచ్చే లక్ష్యంతో అవసరమైన ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్లు, పైప్ లైన్లుతో సవరించిన డీపీఆర్ తో జల్ జీవన్ మిషన్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, జిల్లా కోసం గత 5 సంవత్సరాల అస్తవ్యస్త విధానాలతో కాకుండా వనరుల సద్వినియోగం అయ్యే విధంగా స్పష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచన ఇవ్వడం జరిగింది.
గ్రామీణ సడక్ యోజన :
“ గ్రామీణ సడక్ యోజన “ కింద గ్రామాలలో రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని అధికారుల దృష్టికి తేవడం జరిగింది, జిల్లాలోని మొత్తం 45.09 కిలోమీటర్లకు సంబంధించిన 8 పనులకు సంబందిచి దాదాపు 52.08 కోట్ల అంచనా వ్యయం కాగా, 3 పనులు పూర్తయ్యాయని, 4 పనులు జరుగుతున్నట్లు మరియు 1 పని ప్రారంభం కానట్లు అధికారులు తెలిపారు.
లక్ పతి దీదీ & డ్రోన్ దీదీ :
జిల్లాలో స్వయం సేవ గ్రూపులలోని 62,542 మందిని “ లాక్ పతి దీదీ“ లుగా తీర్చిదిద్దాలని లక్ష్యం.
డ్రోన్లను పైలట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు శిక్షణ ఇవ్వడం ద్వారా చిన్న, సన్నకారుల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా డ్రోనుల వినియోగానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డ్రోనుల పైన సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో 6 మంది డ్రోన్ దీదీలను ఎంపిక చేయగా 6 గురికి శిక్షణ ఇచ్చి, ఇద్దరికీ డ్రోన్లను ఇవ్వడం జరిగింది. మరో 40 మంది డ్రోన్ దీదీలను గుర్తించడం జరిగింది.
పేదలకు గృహ నిర్మాణం :
పీఎంఏవై అర్బన్ క్రింద జిల్లాలో కేటాయించిన 70,119 గృహలకు, పూర్తి అయినవి 31,292 మాత్రమే. అసలు ప్రారంభం కానీ గృహాలు 23,513 . అలాగే పీఎంఏవై గ్రామిణ్ 3,673 లో పూర్తి అయినవి 2,654. అయితే నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాల కల్పన లేక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు, మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. 2019 – 24 మధ్య నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2019 ముందు కేటాయించిన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్దిదారుల దయనీయ పరిస్థితి పైన నివేదిక కోరడం అయినది, అవి పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటున్నామని అధికారులను కోరడమైనది .
2019 – 24 మధ్య పాలన నిర్లక్ష్యం వల్ల జిల్లాలో లబ్ధిదారులకు కేటాయించిన 21,424 టిడ్కో గృహాలలో 7,808 గృహాలను లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 12,976 గృహాలకు పూర్తి స్థాయి మౌలికసదుపాయాలతో పూర్తి అవ్వలేదు. మరియు దాదాపు 90% మౌలికసదుపాయాల కోసం ఖర్చు చేసినట్లు కనబడుతున్నా,దాదాపు 13 వేల మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
అమృత్ :
పట్టణాలలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీటి సరఫరా కోసం మరియు నీటి నిర్వహణ కోసం భీమవరం మున్సిపాలిటీ కోసం అమృత్ 1.0 ఫేస్ 1 క్రింద 2015-16 లో కేటాయించిన నీటి సప్లై అభివృద్ధి పనులకు సంబంధించిన 47.29 కోట్ల నిధుల పనులు మరియు 1.23 కోట్ల రూపాయలతో వీరమ్మ పార్క్ మరియు ఆదర్శ్ నగర్ పార్క్ పూర్తీ అయినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే ఫేస్ 2 క్రింద 36.54 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన 17 ఎంఎల్డీ ఫిల్టరేషన్ ప్లాంట్ మరియు 32.85 కిలోమీటర్ల పనులు పూర్తి అయ్యయి మరియు 5 ఎంఎల్డీ ఎస్టీపీ పనులు 94% పూర్తి అయ్యాయి.
ఈ పరిస్థితులకు కారణం మున్సిపల్ కార్పొరేషన్ నిధులు 2019 – 25 మధ్య సీ ఎఫ్ ఏం ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడమే ప్రధాన కారణం. ఇప్పుడు మిగిలిన పని పూర్తి కావడానికి కాంట్రాక్టర్ సహకరిస్తున్నాడా, లేదా అని అధికారులని ప్రశ్నించడం జరిగింది. మిగిలిన పనులు పూర్తి చేయడానికి నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారని అధికారులను అడగడం జరిగింది.
ఇప్పుడు పూర్తి స్థాయి త్రాగు నీటి అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాల కోసం అమృత్ 2.0 క్రింద 167.72 కోట్ల రూపాయిల ప్రతిపాదనలు తయారు చేశారు.
ఇంత దారుణమైన పరిస్థితులకు కారణం గడచిన 5 సంవత్సరాల అస్తవ్యస్థ విధానాలు. ఇప్పుడు అమృత్ 2.0 క్రింద నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులు సద్వినియోగపరిచి గతంలో పూర్తికాని పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అమృత్ 1.0 లో పూర్తికాని పనులకు అమృత్ 2.0 అనుసంధానానికి ప్రతిపాదనలు లేవు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అమృత్ 2.0 ప్రతిపాదనలు పంపమని తెలపడం జరిగింది
అమృత్ 1.0 ద్వారా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కోసం 15.4 కోట్ల రూపాయిల నిధులు సురక్షిత త్రాగు నీటి సరఫరా కోసం కోట్లు, 50 లక్షలు పార్క్ లకు కేటాయించడం జరిగింది మా శాఖ వారు ఫేస్ 2 లో 31.64 కోట్లు కేటాయించగా – 10% పనులు పూర్తి అయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 32.14 కోట్లు కేటాయించాగా 15% మాత్రమే పని జరిగింది.
ఆకివీడు నగర పంచాయతీ కోసం అమృత్ 2.0 లో 76.34 కోట్ల రూపాయల పనులు డీపీఆర్ దశలో ఉంది.
నర్సాపురం కోసం అమృత 2.0 లో 125.92 కోట్లు అంచన వేసి పంపారు.
తణుకు కోసం అమృత 2.0 లో 118 కోట్లు అంచన వేసి పంపారు.
పాలకోలు కోసం అమృత 2.0 లో 119.26 కోట్లు అంచన వేసి పంపారు.
అమృత్ 2.0 ద్వారా పెడన మున్సిపాలిటీ కోసం 94.34 కోట్ల రూపాయిల నిధులు సురక్షిత త్రాగు నీటి సరఫరా కోసం ఇవ్వగా, ఇప్పటి వరకు ఒక పనిలో కేవలం 12.65 మరియు మరొక పనిలో 1% మాత్రమే పురోగతి ఉంది. అమృత్ 2 .0 ద్వార మరో 4.28 కోట్లు కేటాయించడం జరిగింది.
పీఎం సూర్య ఘర్:
పీఎం సూర్య ఘర్ పథకం అమలులో వేగం పెంచాలి, ఈపథకం క్రింద కనిష్ఠంగా 30 వేలు, గరిష్టంగా 78 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. స్వయం సేవ గ్రూపులతో అనుసంధానం అయ్యి నిర్దేశించిన లక్ష్యాలు అందుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ పథకం క్రింద మొత్తం 14,402 (ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులను కలుపుకొని) రిజిస్ట్రేషన్లు పూర్తి అయినా, ఇన్స్టాలేషన్ చాలా మందగమనంగా 917 పూర్తి అయినట్లు ఉంది, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వర్గాల పైన ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పడం జరిగింది . విద్యుత్ శాఖ వారు సెర్ప్, మెప్మా, మున్సిపల్ శాఖల వారితో సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాలు పూర్తి అవుతాయి కాబట్టి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించడం జరిగింది.
వ్యవసాయ రంగానికి సాయం :
పీఎం కుసుమ్ ద్వార నాణ్యమైన నిరంతరాయ వ్యవసాయ విద్యుశ్చక్తి సరఫర కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పురోగతి అవసరమైన భూమి ఇవ్వలేనందున పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేయడంలేదని అధికారులు సమాచారం ఇచ్చారు.
రాష్ట్రంలో సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల పీఎం ఫసల్ బీమా యోజన ప్రయోజనం 2022 – 24 మధ్య నష్టపోయిన రైతులకు అందలేదు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 77 వేల మంది రైతులు సంవత్సరానికి 6 వేలు కిసాన్ సమ్మాన్ నిధి సహాయం పొందుతున్నారు, గత ఆరు సంవత్సరాలలో 389 కోట్ల లబ్ధి జిల్లాలోని రైతులకు చేకూరింది.
ప్రతి యూరియా బ్యాగ్ పైన దాదాపు 2 వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, జిల్లాలో రైతుల ఎరువుల వాడకం పైన కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ అందింది .
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం “ ప్రకృతి సేద్యాన్ని “ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, రైతులకు ప్రకృతి సేద్యం పైన ఉన్న తొలగించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.
పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో 18 రకాల చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, 15 వేల రూపాయల విలువైన టూల్ కిట్ మరియు సబ్సిడీ వడ్డీ పైన బ్యాంకు రుణం కోసం జిల్లాలో 27,439 మందికి శిక్షణ పూర్తికాగా, 6,305 మంది బ్యాంకు రుణాలు మంజూరు అయ్యి 3,834 మందికి బ్యాంకుల నుండి రుణాలు విడుదల అయ్యాయి. ఒక రకంగా రాష్ట్రంలో అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లాగా నిలిచింది.
పీఎం స్వనిధి క్రింద వీధి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం సహాయంతో జిల్లాలో 12,567 మంది మొదటి దఫా లబ్ధిదారులకు 10 వేల రూపాయల రుణం, రెండవ దఫా లబ్ధిదారులకు 20 వేల రూపాయల రుణం మరియు మూడవ దఫా లబ్ధిదారులకు 50 వేల రూపాయల రుణం వడ్డీ సబ్సిడీ మీద అందించడం జరిగింది.
జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద కేంద్రప్రభుత్వం 1,49,242 కార్డులకు 4.16 లక్షల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద కేంద్రప్రభుత్వం నెలకు ప్రతి ఒక్కరికి 5 కేజీల మరియు ఇందులోని అంత్యోదయ కార్డులు 30,177 కు 68 వేల మందికి 35 కేజీలు బియ్యం ఉచితంగా అందిస్తోంది, ఇది కాకుండా మరో 4,08,777 నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుల ద్వారా 11.51 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, వీరికి రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలురకం పశువుల సంతాన ఉత్పత్తి పెంచడం, ఆవులు , గేదెలను సబ్సిడీ పైన రుణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచి గ్రామాలలో నివసించే వారికి అదనపు ఆదాయం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది.
ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రాగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ మరియు మెరైన్ ఆధారిత తయారీ మరియు సేవ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచి స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోని వికసిత భారత్ కు బాటలు వేయాలి.
భీమవరం ఆర్డీ వో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్. వెంకటేశ్వరరావు, డ్వా మా పి.డి డాక్టర్. కే సిహెచ్ అప్పారావు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్,జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ మంగపతి రావు, డిపిఓ అరుణశ్రీ,డిఎస్ఓ ఎస్ సరోజ, మత్స్య శాఖ అధికారి ఆర్ వి ఎస్ ప్రసాద్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.