బాలల సంరక్షణ కేంద్రాలను తరచూ తనిఖీలు చేయాలి.. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

బాలల సంరక్షణ కేంద్రాలలో బాలలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ, మంచి వాతావరణం కల్పించాలి.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ లైసెన్స్ పొందని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లకు సంబంధించి తదుపరి కార్యాచారణ సిద్ధం చేసి అక్కడ వసతి పొందుతున్న పిల్లల విషయమై చర్యలు తీసుకోవలసినదిగా కమిటీ సభ్యులను ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ డిపార్టుమెంట్ డి.సి.పి.యు సిబ్బంది కలిసి పనిచేయాలని తెలిపారు. లైసెన్సు పొందిన చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్ కూడా బాలలకు సంబంధించి పౌష్టిక ఆహరం, ఆరోగ్యం, రక్షణ మరియు మంచి వాతావరణం కల్పించాలని తెలియజేశారు. డి.సి.పి.యు సిబ్బంది లైసెన్సు పొందిన 12 చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్లను తరచుగా సందర్శన చేయాలని తెలియజేశారు. వాళ్లకు సరియైన ప్రేమ, ఆప్యాయత కుటుంబం లేకపోతే ఆ బాలలు సమాజంలో సంఘ వ్యతిరేక శక్తులుగా మారతారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో చాలామంది తల్లి తండ్రులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం వలన వారి పిల్లల సంరక్షణ బాధ్యతల విషయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి బాలల సంరక్షణ కొరకు బాలల సంక్షేమ సమితి మరియు డిస్టిక్ లెవెల్ రికమెండింగ్ కమిటీ సభ్యుల ద్వారా ఒక లేఖను ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేయాలని ఆదేశించినారు. బాలసదనం, చిల్డ్రన్ హోమ్, తణుకులో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు మాత్రమే అడ్మిషన్ కు అవకాశం ఉందని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా బాలలకు అడ్మిషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. జిల్లా చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లైసెన్స్ కొరకు 19 మంది దరఖాస్తు చేయగా, 12 చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లకు ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన ఆరు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లు నిభందనలకు లోబడి లేనందున దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి 12 చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కొరకు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీ లక్ష్మీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, బాలల సంక్షేమ సమితి సభ్యులు పి.వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ యు.అహ్మద్ ఉన్నీసా, జువనల్ జస్టిస్ బోర్డు సభ్యులు డి.పద్మ , రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కె. శ్రీనివాసరావు, డి.సి.పి.యు- ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ పి. మమతాశ్రీ, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ బి.నెహెమ్యా తదితరులు పాల్గొన్నారు.