Close

ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు అన్నారు.

Publish Date : 07/11/2025

నేడు భీమవరంలో పకృతి సాగు అంగడి ప్రారంభం…

ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు..

పకృతి వ్యవసాయం రైతులను ప్రోత్సహించేందుకు ఇది ఒక చక్కటి మార్గం…

సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బెల్లం, తదితర వస్తువుల అమ్మకం..

సేంద్రియ ఉత్పత్తులు రుచిలో మేటి, ఆరోగ్యంలో సాటి..

… రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

.. భీమవరం శాసనసభ్యులు మరియు పిఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు

శుక్రవారం డిఆర్డిఏ ఆధ్వర్యంలో భీమవరం పీపీ రోడ్డు విస్సాకోడేరు వంతెన డౌన్ లో ఏర్పాటుచేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. అంగడి సాంప్రదాయబద్ధంగా వెదురు బొంగులతో, రెల్లి గడ్డి పైకప్పుతో ఎంతో ఆకర్షణీయంగా డి ఆర్ డి ఏ అధికారి పర్యవేక్షణలో తయారు చేయించడం జరిగింది. ప్రధాన రోడ్డు పక్కన చూపర్లను లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మకానికి ఉంచిన కూరగాయలు, పండ్లు తాజాగా కనువిందు చేస్తున్నాయి. ముఖ్య అతిథులు అంగడి అంతా పరిశీలించి సేంద్రియ ఉత్పత్తులను నగదు చెల్లించి కొనుగోలు చేశారు. రైతులతో, డ్వాక్రా మహిళలతో మాట్లాడి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతున్నారా, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా ఉంది, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల అంగడి సాంప్రదాయబద్ధంగా మంచి వాతావరణం లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్ హెచ్ జిల ద్వారా సేంద్రియ ఉత్పత్తుల అంగడిని నిర్వహించడం ఒక శుభ పరిణామం అన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజలు క్రిమి సంహారక మందులు వినియోగించిన కూరగాయలు, పప్పు ధాన్యాలు వినియోగించిన కారణంగా అనేక అనారోగ్య రుగ్మతలకు గురి అవుతున్నారన్నారు. పెద్ద అమీరంలో కూడా సేంద్రీయ ఉత్పత్తుల అంగడి ప్రారంభించడానికి స్టోర్ తయారవుతుందని, రానున్న పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే తరహాలో అన్ని మండలాల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి సేంద్రియ ఉత్వత్తులు అమ్మకాల స్టోర్లను ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సేంద్రియ ఉత్పత్తులను వినియోగించాలని, తద్వారా సేంద్రి ఉత్పత్తుల సాగు రైతులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ సాగు చేసే రైతుల కూడా పెరుగుతారని, వాటి వినియోగం ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం చే కోరుతుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు సేంద్రియ ఆహారం భుజించడం చాలా ముఖ్యమన్నారు. సాగులో క్రిమిసంహారక మందులు వినియోగించిన ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. ఒకసారి సేంద్రియ ఉత్పత్తులను వినియోగిస్తే మరల అవే వినియోగిస్తారని ఇవి రుచికరంగా ఉంటాయని స్పష్టం చేశారు. కూరగాయలు, ఆకుకూరలు, మిల్లెట్స్, పాలు, జున్ను, రాగి జావా, మొలకలు, పండ్లు, బెల్లం, వివిధ రకాల బియ్యం, తదితర వస్తువులను ఈ స్టోర్ ద్వారా అమ్మడం జరుగుతుందని తెలిపారు. మామూలు కూరగాయలు ధరలకే సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలు ఉన్నాయని, ప్రజలు విరివిగా వినియోగించే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరారు.

భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. పురుగుమందులు వాడని కూరగాయలను ఉపయోగించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, లైవ్లీ హుడ్స్ డిపిఎం కుసుమ కుమారి, ఆర్ వై ఎస్ ఎస్ డిపిఎం నూకరాజు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, పాలకోడేరు ఏపీఎం భారతి, మండల సమైక్య ప్రెసిడెంట్ లక్ష్మీ కుమారి, పాలకోడేరు తహసిల్దార్, ఎంపీడీవో, డి డి ఆర్ డి ఏ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.